Sushant Singh: సుశాంత్‌సింగ్‌ కుటుంబంలో మరో విషాదం.. ప్రమాదంలో ఆరుగురి మృతి

దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ కుటుంబంలో మరో తీరని విషాదం చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.....

Updated : 16 Nov 2021 17:44 IST

పాట్నా: దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ కుటుంబంలో మరో తీరని విషాదం చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. వారంతా సుశాంత్‌సింగ్‌ బంధువులుగా తెలుస్తోంది. బిహార్​లోని లఖీసరాయ్​లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యాస్​ సిలిండర్ల ట్రక్కు సుమోను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి  చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని అక్కడివారు ఆసుపత్రికి తరలించారు. వీరంతా సుశాంత్​ సింగ్​, బిహార్​ మంత్రి నీరజ్​ సింగ్​ బబ్లూ బంధువులుగా అధికారులు గుర్తించారు.

సుశాంత్​సింగ్​ బంధువు, హరియాణా ఏడీజీ ఓంప్రకాశ్​ సింగ్​ సోదరి గీతా సింగ్​ సోమవారం పట్నాలో అనారోగ్యంతో మృతిచెందారు. భర్త లాల్​జీత్​ సింగ్​ సహా మరో తొమ్మిది మంది బంధువులు ఆమె దహనసంస్కారాల అనంతరం పట్నా నుంచి ఓ సుమోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సుమో డ్రైవర్​ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ట్రక్కు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని