Bill Gates: ఈ మహమ్మారి ఎప్పుడు ముగిసిపోవచ్చంటే.. :బిల్ గేట్స్
ఇక సాధారణ పరిస్థితులు వస్తున్నాయనే ఆశ చిగురించే లోపు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకున్నాం.. నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ, విహార యాత్రలు, వేడుకలు వంటి అన్ని ప్రణాళికలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది
కొత్త వేరియంట్పై గేట్స్ చెప్పిన మంచి మాట ఏంటంటే..?
వాషింగ్టన్: ఇక సాధారణ పరిస్థితులు వస్తున్నాయనే ఆశ చిగురించే లోపే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకున్నాం.. నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ, విహార యాత్రలు, వేడుకలు వంటి అన్ని ప్రణాళికలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి.. వేగంగా ప్రబలుతున్న ఈ వేరియంట్, కొద్ది కాలంలో అన్ని దేశాలకు వ్యాపించనుంది.. ఈ మాటలన్నది ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. తాజాగా వరుస ట్వీట్లు చేసిన ఆయన.. ఈ వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థించారు.
‘ఈ కొత్త వేరియంట్ ప్రతి ఇంటికీ వ్యాపిస్తుంది. ఇప్పటికే నా స్నేహితుల్లో కొందరు దీని బారినపడ్డారు. నేను ఈ సెలవుల్లో వేసుకున్న ప్రణాళికలన్నీ దాదాపుగా రద్దు చేసుకున్నాను. చరిత్రలో ఏ వైరస్ ప్రబలనంతా వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. కొద్ది కాలంలోనే ప్రపంచంలో అన్ని దేశాలకు చేరుకుంటుంది. అయితే దీనివల్ల వ్యాధి తీవ్రత ఏమేరకు ఉంటుందనేది ఇప్పుడు మనకు తెలియని అతి పెద్ద విషయం. దీని గురించి మరిన్ని విషయాలు తెలిసేవరకూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డెల్టాతో పోల్చితే.. ఒమిక్రాన్తో వ్యాధి తీవ్రత సగం మాత్రమే ఉన్నా.. వేగంగా ప్రబలే లక్షణం వల్ల ఉద్ధృతి భారీ స్థాయిలో ఉండొచ్చు. ఈ సమయంలో మనం ఒకరికొకరం సహకరించుకోవాలి. అలాగే మాస్కులు ధరించాలి. ఇళ్లలో పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చూసుకోవాలి. తప్పకుండా టీకాలు తీసుకోవాలి. బూస్టర్ తీసుకుంటే రక్షణ మరింత మెరుగవుతుంది. టీకా తీసుకున్నవారిలో బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. అయితే టీకాలు ప్రజలు తీవ్ర ఆనారోగ్యం బారినపడకుండా, మరణించకుండా ఉండేలా రూపొందించినవి. ఆ విషయంలో అవి మెరుగ్గా పనిచేస్తున్నాయి’ అని బిల్గేట్స్ ట్వీట్లు చేశారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన ఆయన.. చివరగా ఒక మంచి మాట చెప్పి ముగించారు. ‘ఒక దేశంలో ఒమిక్రాన్ డామినెంట్గా మారిన తర్వాత.. ఆ వేవ్ అక్కడ మూడు నెలల కంటే తక్కువ సమయమే ఉంటుంది. ఆ కొన్ని నెలలు మనకు చెడు రోజులుగా మారొచ్చు. కానీ మనం సరైన చర్యలు తీసుకుంటే.. ఈ మహమ్మారి 2022లో ముగిసిపోవచ్చు. ఈ సారి కూడా సెలవులన్నీ కరోనాతోనే వృథా కావడం నిరాశపరిచిందని తెలుసు. ఎప్పటికీ ఇలాంటి పరిస్థితే ఉండదుగా.. ఏదోఒక రోజు కరోనా ముగిసిపోతుంది. మనం ఒకరికొకరం సహకరించుకుంటే.. ఆ సమయం త్వరలోనే వస్తుంది’ అని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్కు సంబంధించి మరో కీలక వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ షేర్ చేశారు. -
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య