Yamuna River: క్లీన్ యమునాకు ఆరు సూత్రాల ప్రణాళిక : కేజ్రీవాల్
దేశరాజధాని దిల్లీ సమీపంలో ప్రవహించే యమునా నది ప్రక్షాళన కోసం ఆరు సూత్రాల ప్రణాళికను అమలు చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఆప్ ప్రభుత్వంపై మండిపడ్డ భాజపా, కాంగ్రెస్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ సమీపంలో ప్రవహించే యమునా నది ప్రక్షాళన కోసం ఆరు సూత్రాల ప్రణాళికను అమలు చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను (STPs) ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచుతామని అన్నారు. ఇలా 2025 నాటికి యమునా నదిని స్నానాలు చేసేందుకు వీలుండే విధంగా తీర్చిదిద్దేందుకు ఈ ఆరు సూత్రాల ప్రణాళికను తమ ప్రభుత్వం సిద్ధం చేసిందని వెల్లడించారు. దీనిపై భాజపా, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. యమునా ప్రక్షాళనపై ఎన్నో ఏళ్లుగా కేజ్రీవాల్ వరుస వాగ్దానాలు చేస్తూనే ఉన్నారని.. రోజురోజుకూ మరింత కలుషితమవుతోందని విమర్శించాయి.
యమునా నదిలో స్నానాలు చేసేవిధంగా శుద్ధి చేయడంతోపాటు లండన్లోని థేమ్స్ నది మాదిరిగా తీర్చిదిద్దుతామని 2013 నుంచి కేజ్రీవాల్ హామీలు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రోజురోజుకీ ఇది మరింత కలుషితమవుతోందని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.2409 కోట్లను అందించినప్పటికీ ఆ నిధులు ఎక్కడికి వెళుతున్నాయో ఎవ్వరికీ తెలియదని ఆరోపించారు. మరోవైపు యమునా ప్రక్షాళనపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై దిల్లీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భాజపా ఎంపీ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు.
యమునా నది శుద్ధి పేరుతో గడిచిన ఏడు సంవత్సరాలుగా కేజ్రీవాల్ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోందని.. అయినప్పటికీ నీరు శుద్ధికాకపోగా మరింత విషపూరితంగా మారుతోందని దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ ఛౌధరి విమర్శించారు. తీవ్ర కాలుష్యంతో సతమతమవుతున్న దిల్లీ ప్రజల దృష్టి మరల్చేందుకే క్లీనింగ్ యమునా పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారని ఆరోపించారు. 2025 నాటికి డెడ్లైన్ విధించినట్లు ప్రకటించారని, అప్పటి వరకు కోట్ల రూపాయలు మురుగునీటిలో కలవడం ఖాయమని అన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆమ్ఆద్మీపార్టీ.. అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లనుంచి ఏం చేస్తోందని అనిల్ ఛౌధరి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి