Mumbai: అమితాబ్‌ నివాసానికి బాంబు బెదిరింపు.. భద్రత పెంపు

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసం, ముంబయిలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు బిగ్‌బీ నివాసం, రైల్వే

Published : 07 Aug 2021 10:04 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసం, ముంబయిలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు బిగ్‌బీ నివాసం, రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే అది నకిలీ బెదిరింపు కాల్‌ అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

ముంబయి పోలీసు ప్రధాన కంట్రోల్‌ రూమ్‌కు శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ కాల్‌ వచ్చింది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టర్మినస్‌, బైకుల్లా, దాదర్‌ రైల్వే స్టేషన్లు, జుహూలోని అమితాబ్‌ నివాసం వద్ద బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు సమాచారమిచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు సమాచారమిచ్చారు. బాంబు స్క్వాడ్‌, జాగిలాలను తీసుకొని బిగ్‌బీ నివాసం సహా రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అది నకిలీ బెదిరింపు కాల్‌గా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. కాల్‌ చేసిన వ్యక్తి గురించి తెలుసుకునేందుకు దర్యాప్తు సాగుతున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని