Omicron: ఒమిక్రాన్కు తక్షణమే అడ్డుకట్ట.. సులభ మార్గం ఏంటంటే!
ప్రమాదకరమైన వేరియంట్గా భావిస్తోన్న ఒమిక్రాన్కు తక్షణమే అడ్డుకట్ట వేయాలంటే అందుకు అవసరమైన బూస్టర్ డోసులు రూపొందించడమే సులభ మార్గమని ప్రముఖ వైరాలజిస్టు జాకబ్ జాన్ పేర్కొన్నారు.
ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ జాకబ్ జాన్
దిల్లీ: ప్రమాదకరమైన వేరియంట్గా భావిస్తోన్న ఒమిక్రాన్కు తక్షణమే అడ్డుకట్ట వేయాలంటే అందుకు అవసరమైన బూస్టర్ డోసులు రూపొందించడమే సులభ మార్గమని ప్రముఖ వైరాలజిస్టు జాకబ్ జాన్ పేర్కొన్నారు. ఇక ఈ వేరియంట్ థర్డ్వేవ్కు కారణం కాకపోవచ్చని అంచనా వేసిన ఆయన.. కొత్త వేరియంట్లతో బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లు రావడం సహజమేనని అన్నారు. అయినప్పటికీ ఆశాజనకంగా ఉంటూనే.. ఎటువంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికీ వైరస్ సోకే అవకాశం ఉందని (Breakthrough) నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో జాకబ్ జాన్ ఈ విధంగా స్పందించారు.
భయం అవసరం లేదు..
‘మనదేశంలో 8 నెలల పాటు కొనసాగిన కొవిడ్-19 తొలివేవ్లో దాదాపు 30శాతం మంది భారతీయులు వైరస్ బారినపడ్డారు. అనంతరం మూడు నెలల పాటు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సెకండ్ వేవ్లో అత్యధికంగా 75 నుంచి 80శాతం (రీ ఇన్ఫెక్షన్లతో కలిపి) వైరస్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో విస్తృత వేగంతో కొత్త వేరియంట్ విరుచుకుపడితే ఏమవుతుందో అంచనా వేయలేం. అయితే, ప్రజలు భయపడుతున్నంత భయం మాత్రం ఉండకపోవచ్చు. థర్డ్ వేవ్కు కూడా ఇది కారణం కాకపోవచ్చు. అయినప్పటికీ వైరస్ను రాకుండా చూసుకోవడంతోపాటు రోగనిరోధకత (హెర్డ్ ఇమ్యునిటీ)ని పెంచుకోవడమే తెలివైన మార్గం’ అని ఐసీఎంఆర్కు చెందిన ‘సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ వైరాలజీ’ మాజీ డైరెక్టర్ డాక్టర్ జాకబ్ జాన్ పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ వేగం పెంచాలి..
‘దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30శాతం మందికి పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్ అందింది. వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వ్యాక్సిన్ తీసుకోని వారికి వ్యాక్సిన్ అందించడం, రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ ఇవ్వడం అత్యంత ముఖ్యం. వేరియంట్కు తక్షణమే అడ్డుకట్ట వేసేందుకు బూస్టర్ డోసులను అందించడమే తేలికైన మార్గం. పిల్లలకు, గర్భిణీలకు వ్యాక్సిన్ (పూర్తి మోతాదులో) ఇవ్వాలి’ అని జాకబ్ జాన్ పేర్కొన్నారు. ఇక కొత్త వేరియంట్లను వ్యాక్సిన్లు ఏమేరకు ఎదుర్కొంటాయి? అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ (Breakthrough) బారినపడడం సహజమేనన్నారు. కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడంతోపాటు వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు కావాల్సిన రోగనిరోధకతను బూస్టర్ డోసుల వల్ల పొందవచ్చని స్పష్టం చేశారు.
డెల్టా కంటే ప్రమాదకరమే..?
ఇక ఒమిక్రాన్లో ఇప్పటి వరకు 34 మ్యుటేషన్లు జరిగినట్లు పేర్కొన్న జాకబ్ జాన్, ఆందోళనకర ఆల్ఫా బీటా, గామా, డెల్టా వేరియంట్ కంటే ఇవి ఎక్కువేనని వెల్లడించారు. ఒరిజినల్ వేరియంట్తో పోలిస్తే డెల్టాకు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వ్యాప్తిచెందే గుణం దీనికి ఉందన్నారు. ఒమిక్రాన్కు అంతకంటే ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దాదాపు పదిరెట్లు ఎక్కువ వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్లు స్విట్జర్లాండ్కు చెందిన ఓ శాస్త్రవేత్త తనతో చెప్పినట్లు వివరించారు. అంతేకాకుండా రెండు డోసుల వల్లే కలిగే రోగనిరోధకతను తట్టుకునే సామర్థం ఈ కొత్త వేరియంట్కు ఉండే అవకాశం ఉన్నందున బూస్టర్ డోసులను రూపకల్పనకు నడుం బిగించాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు