ZyCoV-D: చిన్నారుల టీకా.. తొలుత ఆ 7 రాష్ట్రాల్లోనే..!
జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ టీకాను తొలుత 7 రాష్ట్రాల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కసరత్తు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ టీకాను తొలుత 7 రాష్ట్రాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో త్వరలోనే బిహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అందించనున్నారు. సూది అవసరం లేకుండానే ఇచ్చే ఈ టీకా పంపిణీకి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా పూర్తిచేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
సూది అవసరం లేకుండా మూడు డోసుల్లో ఇచ్చే జైకోవ్-డీ టీకాను 12ఏళ్లు పైబడిన వారి వినియోగానికి ఆగస్టు 20వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జైడస్ క్యాడిలా రూపొందించిన ఈ టీకా ప్రపంచంలో తొలి డీఎన్ఏ ఆధారిత కొవిడ్ టీకాగా నిలిచింది. వ్యాక్సినేషన్లో భాగంగా అందించేందుకు గానూ కోటి డోసుల కోసం ఇప్పటికే కేంద్రం ఆర్డరు చేసింది. పత్రిడోసుకు రూ.265 చొప్పున కోటి డోసులను కొనుగోలు చేసింది. అయితే, సూది అవసరం లేకుండా ఇచ్చే ఈ టీకా పంపిణీకి ప్రత్యేకంగా ‘జెట్ అప్లికేటర్’ అనే పరికరాన్ని వినియోగించనున్నారు ఆ పరికరానికి మరో రూ.93 ఖర్చు అదనం కావడంతో మొత్తంగా ఒక డోసుకు దాదాపు రూ.358 కానుంది.
84శాతం మందికి తొలిడోసు..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 125కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాటిలో 79.13కోట్ల (84శాతం) మంది అర్హులకు తొలిడోసు అందించగా.. 45.8కోట్ల (49శాతం) మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించామని తెలిపింది. ఇంటింటికి టీకా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వ్యాక్సిన్ పంపిణీలో మరింత వేగం పెరిగినట్లు పేర్కొన్న కేంద్రం బిహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో చాలా మంది ఇంకా తొలిడోసే తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సూది అవసరం లేకుండా ఇచ్చే జైకోవ్-డీ వ్యాక్సిన్ను ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తొలుత పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా