Corona Virus: కొత్త వేరియంట్తో జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
కొవిడ్ కొత్త వేరియంట్పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని .....
దిల్లీ: దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్ (B.1.1.529)పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. వారికి కొవిడ్ పరీక్షలు కచ్చితంగా చేయాలని సూచించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అదనపు చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా కొవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయితే వెంటనే వారి శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లకు పంపాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో దగ్గరగా మెలిగిన వారిని ట్రాక్ చేసి కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వీసా పరిమితులు తగ్గించడం, అంతర్జాతీయ ప్రయాణంపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ వేరియంట్ వ్యాప్తికి అవకాశం ఉంటుందని, అందువల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతున్న B.1.1.529 రకం వేరియంట్ను వైద్యరంగ నిపుణులు గుర్తించారు. ఈ వేరియంట్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియంట్పై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైంది. మరోవైపు, కొవిడ్ దాటికి ప్రపంచంలోని చాలా దేశాలు కుదేలైనప్పటికీ.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో మాత్రం కొవిడ్ తీవ్రత కాస్త తక్కువగానే ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో దక్షిణాఫ్రికా పొరుగుదేశమైన బోత్సువానాలో కొత్త వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు