Omicron: భారత్లో ఒమిక్రాన్ తీవ్రత తక్కువే..?
వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వస్తున్నప్పటికీ భారత్లో మాత్రం దీని తీవ్రత తక్కువగానే ఉండవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
టీకానే ఆయుధం - కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వస్తున్నప్పటికీ భారత్లో మాత్రం దీని తీవ్రత తక్కువగానే ఉండవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముఖ్యంగా దేశంలో అర్హులైన వారిలో మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్ అందడంతోపాటు ఇప్పటికే ఎంతోమంది డెల్టా వేరియంట్కు గురైన కారణంగా ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగా ఉండవచ్చని అంచనా వేసింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో వీటికి సంబంధించి తరచుగా అడుగు ప్రశ్నలకు (FAQs) కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానాలు ఇచ్చింది.
తీవ్రత తక్కువే..
ఓవైపు ముమ్మరంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్, మరోవైపు మెజారిటీ ప్రజలు డెల్టా వేరియంట్కు గురైనట్లు సీరో పాజిటివిటీ సర్వేల ఆధారాలను బట్టి చూస్తే ప్రస్తుతం కొత్త వేరియంట్ ప్రభావం భారత్లో తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా జులై నాటికే దాదాపు 70శాతం మందికి డెల్టా ఇన్ఫెక్షన్ సోకినట్లు వచ్చిన సర్వేల నివేదికలను గుర్తుచేసింది. అయినప్పటికీ దీనిపై శాస్త్రీయ ఆధారాల కోసం వేచిచూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేసుల సంఖ్య పెరగొచ్చు..
కొత్తగా వెలుగు చూసిన వేరియంట్ దేశంలో థర్డ్వేవ్కు కారణమవుతుందా అన్న ప్రశ్నపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. భారత్తోపాటు ఇప్పటికే చాలా దేశాలకు విస్తరించిందని.. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు వ్యాపించనుందని పేర్కొంది. అంతేకాకుండా మరికొన్ని రోజులు, వారాల్లోనే భారత్లో వీటి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ మనదేశంలో దీని తీవ్రత మాత్రం తక్కువగా ఉండవచ్చనే అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్త వేరియంట్ గుర్తించిన ఇద్దరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయన్న ప్రభుత్వం.. వైరస్ ప్రాబల్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఇప్పటివరకు పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిలో ఒకరు విదేశీయుడు కాగా.. బెంగుళూరుకు చెందిన మరో వ్యక్తికి ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. వ్యాక్సిన్..
ఒమిక్రాన్ వేరియంట్లో చోటుచేసుకున్న మ్యుటేషన్లు వ్యాక్సిన్ సమర్థతను తగ్గిస్తాయని వస్తోన్న ఊహాగానాలపైనా కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ఈ వేరియంట్పై ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వ్యాధి తిరగబడడం, రోగనిరోధకతశక్తి నుంచి కొత్త వేరియంట్ తప్పించుకునే సామర్థ్యంపై మరింత సమాచారం రావాల్సి ఉందని తెలిపింది. అయినప్పటికీ వ్యాక్సిన్లతోనే పూర్తి రక్షణ పొందవచ్చన్న కేంద్ర ఆరోగ్యశాఖ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. వీటికితోడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.. అది భాజపా ప్రశ్న అని అన్నారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
Ayodhya Ram Mandir: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. -
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కోర్టు వెలుపలి నేర అంగీకారాలు బలహీన సాక్ష్యాధారాలే
న్యాయస్థానం వెలుపల నిందితులు చేసే నేర అంగీకారాలు స్వభావ రీత్యా బలహీనమైన సాక్ష్యాలే అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. బలమైన సాక్ష్యాలను సమర్థించేవిగా మాత్రమే అవి ఉంటాయని పేర్కొంది. -
12వ తరగతి తర్వాత మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు అనుమతివ్వాలి
ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. -
సంక్షిప్త వార్తలు(6)
అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు. -
నేను ఏ పార్టీకీ ప్రచారం చేయలేదు.. అది నకిలీ వీడియో: ఆమిర్ ఖాన్
ఓ రాజకీయ పార్టీ తరఫున తాను ఎన్నికల ప్రచారం చేసినట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో నకిలీదని బాలీవుడు నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. -
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది
లోక్సభ ఎన్నికల్లో ఈ నెల 19న తొలివిడత పోలింగు జరగనున్న రాష్ట్రాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించే ప్రక్రియ మంగళవారం మొదలైంది. -
అల్లోపతి వైద్యాన్ని కించపరిచారో జాగ్రత్త
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టు ఉత్తర్వులను గతంలో మీరెలా అవహేళన చేశారో మాకు తెలుసు. -
న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు తీసుకోలేం
న్యాయ ప్రక్రియలో, న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకొనే చర్యలను తాము తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
మావోయిస్టుల సమాచారం ఇస్తే రూ.5 లక్షల బహుమతి
ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తే.. రూ.5 లక్షల నగదుతో పాటు, ఉద్యోగం కల్పిస్తామని అక్కడి పోలీసులు మంగళవారం ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
-
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
-
అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం
-
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు
-
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్