PM Modi: ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ లక్ష్యంగా..!
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్య కేంద్రం ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్న ప్రధాని మోదీ
దిల్లీ: దేశంలో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్య కేంద్రం ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్లో నాలుగు జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.
‘కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ ఆరోగ్య రంగానికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి దేశం తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ కూడా సంక్షోభ సమయంలో ఆరోగ్య రంగంలో తన శక్తిని, స్వయం సమృద్ధిని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఈ నాలుగు జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అడుగులు పడ్డాయి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014 నుంచి కేవలం ఒక్క రాజస్థాన్లోనే 23 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. అందులో ఇప్పటికే ఏడు కాలేజీలు కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. 2001లో గుజరాత్ ఆరోగ్య రంగం ఎదుర్కొన్న సవాళ్లను మోదీ గుర్తు చేశారు.. అనంతరం పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలను వివరించారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో 82వేల యూజీ & పీజీ సీట్లు మాత్రమే ఉన్నాయని.. కానీ, ప్రస్తుతం ఆ సంఖ్య లక్షా 40వేలకు చేరిందని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతేకాకుండా 6 ఎయిమ్స్ల నుంచి 22 ఎయిమ్స్లకు పెంచే ప్రయత్నం చేశామన్నారు. గడిచిన 6-7 ఏళ్లలోనే కొత్తగా 170 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయని.. మరో వంద మెడికల్ కాలేజీలు అభివృద్ధి దశలో ఉన్నాయని చెప్పారు. ఇలా కనీసం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాకుండా దేశంలో ఆరోగ్య వ్యవస్థ భిన్న స్థాయిలో ఉందని.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పెద్ద ఆసుపత్రుల వరకు అన్నింటినీ ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ ఆలోచనలో భాగంగానే స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్తో పాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?