
Covid Origins: నిరాధార ఆరోపణలు చేస్తే ఎదురుదాడికి సిద్ధం: చైనా
కొవిడ్ మూలాలను అమెరికా రాజకీయం చేస్తోందన్న చైనా
బీజింగ్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి మూలాలపై అమెరికా-చైనా మధ్య కోల్డ్వార్ నడుస్తూనే ఉంది. తాజాగా వీటిపై మరింత స్వరం పెంచిన చైనా.. కొవిడ్ విషయంలో తమపై నిందలు వేస్తూ ఈ విషయాన్ని అమెరికా రాజకీయం చేస్తోందని మండిపడింది. కేవలం చైనాను బలిపశువు చేసినంత మాత్రాన.. అమెరికా కప్పిపుచ్చుకోలేదని చైనా విదేశాంగశాఖ డైరెక్టర్ జనరల్ ఫూ కాంగ్ స్పష్టం చేశారు. ఒకవేళ తమపై నిరాధార ఆరోపణలు చేయాలనుకుంటే.. తాము చేసే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కొవిడ్ మూలాలపై అమెరికా రూపొందించిన నివేదిక త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాలశాఖ డీజీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ తొలుత చైనాలోని వుహాన్లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే, మహమ్మారి బయటపడి దాదాపు 20 నెలలు కావొస్తున్నా.. వాటి మూలాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇప్పటికే వీటిపై దర్యాప్తు జరిపిన ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ప్రతినిధుల బృందం.. మరోసారి వాటిని శోధించేందుకు సన్నద్ధమవుతోంది. ఇదే సమయంలో వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయ్యిందనే వాదనలు అంతర్జాతీయంగా ఎక్కువయ్యాయి. ఈ వాదనకు మద్దతివ్వాలనుకుంటే అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ను డబ్ల్యూహెచ్వో బృందం సందర్శించాలని చైనా విదేశాంగ శాఖ డీజీ సూచించారు. ఇది న్యాయమైన అంశంగా పేర్కొన్న ఫూ కాంగ్.. దాని తర్వాతే వుహాన్లో రెండోసారి దర్యాప్తునకు రావచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్, కొవిడ్ మూలాలపై వస్తున్న ఇరు వాదనలపై ఓ నివేదికను రూపొందించి ఇవ్వాలని అక్కడి నిఘా విభాగానికి సూచించారు. దాన్ని 90 రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదేశించారు. తాజాగా ఆ గడువు సమీపించడంతో అమెరికా అధికారులు వారివద్ద ఉన్న కీలక సమాచారంతో ఓ నివేదికను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనకు గురౌతున్న చైనా.. వుహాన్ ల్యాబ్ లీక్ థియరీపై అమెరికా చేస్తున్న ఆరోపణలను చైనా ముందుగానే తిప్పికొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
TS Inter Results 2022: మీ మార్కుల మెమో డౌన్లోడ్ చేసుకున్నారా?
-
India News
Mumbai: ముంబయిలో భవనం కుప్పకూలి 14మంది మృతి!
-
General News
CM KCR: హైదరాబాద్లో మరో కీలక ఘట్టం... టీహబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
India News
Sanjay raut: సంజయ్ రౌత్కు ఈడీ మళ్లీ సమన్లు
-
Business News
Mukesh Ambani: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్బాబు
- ఆవిష్కరణలకు అందలం
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత