China ZeroCovid: చైనాను వెంటాడుతోన్న ‘జీరో-కొవిడ్’ కష్టాలు..!
కరోనాకు పుట్టినిళ్లైన చైనా మాత్రం ‘కొవిడ్-జీరో (Zero Covid)’ వ్యూహంతోనే కరోనా కట్టడిలో ముందుకెళుతోంది.
కేసులను సున్నాకు తీసుకొచ్చే వ్యూహంతోనే కొవిడ్పై పోరు
బీజింగ్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వివిధ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్ రూపాంతరం చెందుతూ మళ్లీ విజృంభిస్తుండడంతో పలు దేశాలు కట్టడి వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా వైరస్తో కలిసి జీవిస్తూనే మహమ్మారిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కరోనాకు పుట్టినిల్లైన చైనా మాత్రం ‘కొవిడ్-జీరో (Zero Covid)’ వ్యూహంతోనే ముందుకెళుతోంది. ఇదే సమయంలో అక్కడ పలు నగరాల్లో వైరస్ ఉద్ధృతి పెరగడంతో నానా కష్టాలు పడుతోంది.
రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. వైరస్తో కలిసి జీవించే (Live with Covid) వ్యూహాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయి. కానీ, చైనా మాత్రం కొవిడ్ కేసులను సున్నాకు తీసుకువచ్చే ‘జీరో-కొవిడ్’ కట్టడి వ్యూహాన్నే నమ్ముకుంది. దీంతో ఒక్క కేసు వెలుగు చూసినా.. లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ చేపడుతోంది. ఇందుకోసం భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్డౌన్ విధించడంతోపాటు విమాన ప్రయాణాలపైనా ఆంక్షలు కొనసాగిస్తోంది. గత కొంతకాలంగా పలు ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేక చైనా తీవ్రంగా శ్రమిస్తోంది.
సమర్థించుకుంటున్న డ్రాగన్..
అధిక జనాభా కలిగిన చైనాలో వైరస్ కట్టడికి అనుసరిస్తోన్న జీరో వ్యూహమే మేలని స్థానిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ వైరస్తో కలిసి జీవించాల్సి వస్తే ఎంతోమంది ఇన్ఫెక్షన్ బారినపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే జీరో కట్టడి వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. అయితే, ఈ వ్యూహం ఎంతకాలం విజయవంతం అవుతుందో చెప్పలేమని చైనా ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఈ విధానంపై చైనా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే, శీతాకాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున చైనా ప్రభుత్వం తన విధానంపై పునః పరిశీలన చేసుకోవచ్చని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు పీటర్ కల్లిగ్నాన్ పేర్కొన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలు కూడా చైనా వ్యూహాన్నే అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు.
పలు రంగాలపై ప్రతికూల ప్రభావమే..
చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్ వ్యూహం వల్ల పలు రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు కేంద్రంగా ఉండే ఆతిథ్య రంగం కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని బీఎన్పీ పరిబాస్ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థకు చెందిన నిపుణురాలు జెస్సికా టీ అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం వరకూ కొవిడ్ కట్టడి వ్యూహంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని చైనాలోని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్కి చెందిన చీఫ్ ఎకనమిస్ట్ షువాంగ్ డింగ్ పేర్కొన్నారు. అప్పటివరకు ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్పై హెర్డ్ ఇమ్యూనిటీ ఫలితాలు, కొవిడ్ను స్థానిక వ్యాప్తిగా పరిగణించే ప్రకటనలను పరిశీలించిన తర్వాత చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
అప్పటివరకూ సరిహద్దుల మూతేనా..?
చైనాలో కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా దేశ సరిహద్దులను ఆ ప్రభుత్వం మూసివేసింది. ఆంక్షల నడుమ పరిమిత సంఖ్యలో మాత్రమే విదేశీయులను అనుమతి ఇస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయి. అంతేకాకుండా ఇతర దేశాల ఎగుమతి, దిగుమతులపైనా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా చైనాలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ వరకూ అంతర్జాతీయ కొవిడ్ ఆంక్షలను చైనా ఎత్తివేయకపోవచ్చని అక్కడి పర్యాటకరంగ నిపుణులు గేరీ బొవెర్మ్యాన్ అంచనా వేశారు. మరో ఏడాది తర్వాతే సరిహద్దు ఆంక్షలను చైనా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. ఇలా వైరస్ కట్టడిని సమర్థంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న చైనా.. జీరో కొవిడ్ వ్యూహంతో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.