China: జీరో కొవిడ్ వ్యూహంతో.. చైనా అగచాట్లు..!
పలు నగరాల్లో లాక్డౌన్ విధించిన చైనా.. జీరో కొవిడ్ వ్యూహంతో నానా తంటాలు పడుతోంది.
వైరస్ కట్టడి చేయలేక తీవ్ర ఒత్తిడి
బీజింగ్: ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్-19.. తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా పలు ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 2500 క్రియాశీల కేసులు ఉన్నట్లు చైనా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో పలు నగరాల్లో లాక్డౌన్ విధించిన చైనా.. జీరో కొవిడ్ వ్యూహంతో నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా వింటర్ ఒలింపిక్స్కు సమయం దగ్గరపడుతున్న వేళ కొవిడ్ను కట్టడి చేయలేక తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ.. అటు చైనాలోనూ వైరస్ ఉద్ధృతి మెల్లగా పెరుగుతోంది. చాలా నగరాల్లో నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గురువారం ఒక్కరోజు 207 పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. వీరిలో 156 కేసులు స్థానికంగా వ్యాప్తిచెందగా.. 51 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలోనని పేర్కొంది. ఇలా మొత్తంగా ప్రస్తుతం 2,563 బాధితులు చికిత్స తీసుకుంటుండగా.. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రకటించింది. వుహాన్లో తొలికేసు వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా 1,01,890 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,636 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
ఒమిక్రాన్పై లేని సమాచారం..
విశ్వవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో చైనా మాత్రం కట్టడి చర్యలను కఠినంగా అమలు చేస్తోంది. ఓవైపు సరిహద్దులను నియంత్రిస్తూనే అంతర్జాతీయ ప్రయాణాలను పరిమితం చేస్తోంది. ముఖ్యంగా ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా.. ఒక్క కేసు బయటపడినా లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతోంది. వైరస్ సోకిన వారిని ట్రేసింగ్ చేయడంతోపాటు కేసుల సంఖ్యను సున్నాకు తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో డిసెంబర్ 13న తియాంజిన్ ప్రావిన్సులో తొలి ఒమిక్రాన్ నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. కానీ దేశవ్యాప్తంగా దాని వ్యాప్తిపై మాత్రం ఇప్పటికీ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
కొవిడ్-19 విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో కట్టడి చర్యలు, వ్యాక్సిన్ పంపిణీ, వైరస్తో కలిసి జీవించే వ్యూహంతో ప్రపంచ దేశాలు ముందుకెళుతున్నాయి. కానీ చైనా మాత్రం కేసుల సంఖ్యను సున్నాకు తీసుకువచ్చే జీరో కొవిడ్ వ్యూహాన్నే నమ్ముకుంది. తాజాగా డెల్టాతోపాటు ఒమిక్రాన్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరగడంతో డ్రాగన్ దేశం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా అక్కడ కొత్త సంవత్సరం (ఫిబ్రవరి 1), వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) సమీపిస్తుండడంతో వైరస్ను కట్టడి చేయలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొవిడ్-19కు కారణమైన కరోనా వైరస్ వెలుగు చూసి డిసెంబర్ 31కి రెండేళ్లు పూర్తయ్యింది. అయినప్పటికీ వీటికి సంబంధించిన మూలాలు మిస్టరీగా మిగిలిపోయాయి. తొలిసారి వైరస్ బయటపడిన వుహాన్లోనూ కొవిడ్ కేసులు నమోదవుతూనే ఉండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు