Civils 2020 Toppers Score: సివిల్స్ టాపర్ సాధించిన స్కోర్ ఎంతో తెలుసా..?
సివిల్ సర్వీసెస్ పరీక్ష - 2020 ఫలితాల్లో టాపర్గా నిలిచిన శుభమ్ కుమార్ మొత్తంగా 52.04 శాతం మార్కులు సాధించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వెల్లడించింది.
వివరాలు వెల్లడించిన యూపీఎస్సీ
దిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో టాపర్గా శుభమ్ కుమార్ నిలవగా.. జగ్రతి అవాస్థి రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఆ పరీక్షల్లో శుభమ్ మొత్తంగా 52.04 శాతం మార్కులు సాధించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వెల్లడించింది. రెండో ర్యాంకు సాధించిన జగ్రతి 51.95 శాతం మార్కులు పొందినట్లు తెలిపింది. సివిల్స్కు ఎంపికైన వారు సాధించిన మార్కుల వివరాలను యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది.
సివిల్స్ పరీక్షలో మొత్తం 2025 మార్కులు ఉండగా.. 1750 మార్కులు మెయిన్ పరీక్షకు, మరో 275 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయిస్తారు. వీటిలో ఈసారి సివిల్స్ టాపర్గా నిలిచిన శుభమ్ కుమార్ మొత్తం 1054 మార్కులు సాధించారు. రాత పరీక్షలో 878 మార్కులు పొందగా.. ఇంటర్వ్యూలో 176 మార్కులు సాధించినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. తొలి ఐదు ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
తొలి ర్యాంకు - శుభమ్ కుమార్ - 1054 మార్కులు (రాతపరీక్షలో 878, ఇంటర్వ్యూలో 176)
రెండో ర్యాంకు - జాగ్రతి అవాస్థి - 1052 మార్కులు (రాతపరీక్షలో 859, ఇంటర్వ్యూలో 193)
మూడో ర్యాంకు - అంకితా జైన్ - 1051 మార్కులు (రాతపరీక్షలో 839, ఇంటర్వ్యూలో 212)
నాలుగో ర్యాంకు - యాష్ జాలుకా 1046 మార్కులు (రాతపరీక్షలో 851, ఇంటర్వ్యూలో 195)
ఐదో ర్యాంకు - మమతా యాదవ్ 1042 మార్కులు (రాతపరీక్షలో 855, ఇంటర్వ్యూలో 187) సాధించారు.
అఖిల భారత సర్వీసుల కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 ఫలితాల్లో మొత్తం 761 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 61 మంది ఎస్టీతో పాటు 86 మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పరీక్ష మూడు విభాగాల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) జరుగుతుంది. ప్రిలిమ్స్లో మొత్తం 400 మార్కులు ఉండగా.. కేవలం వీటిని స్ర్కీనింగ్ టెస్టుగానే పరిగణిస్తారు. వీటిలో సాధించిన మార్కులు మెరిట్ జాబితాలో పరిగణించరు. కేవలం మెయిన్, ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగానే యూపీఎస్సీ మెరిట్ జాబితాను రూపొందిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!