Corona in Kerala: దేశవ్యాప్తంగా తగ్గినా.. కేరళను వణికిస్తోన్న మహమ్మారి!
మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి.
దేశంలో రోజువారీ కేసుల్లో సగం ఒక్క కేరళలోనే
తిరువనంతపురం: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మూడో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేరళలో కొవిడ్ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒక్కరోజే 22వేల కేసులు..
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తొలిరోజుల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళ ఉత్తమ పనితీరు కనబరిచింది. దేశవ్యాప్తంగా వైరస్ విలయతాండవం చేసిన సమయంలోనూ కేరళ ప్రభుత్వం మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. దీంతో కేరళ తీసుకుంటున్న వైరస్ కట్టడి చర్యలను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కూడా కొనియాడింది. కానీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి అదుపులోకి వచ్చినప్పటికీ కేరళలో మాత్రం నిత్యం 10వేలకుపైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినప్పటికీ కేరళలో ఇంకా 10శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. అంతేకాకుండా గడిచిన 24గంటల్లో అత్యధికంగా 22వేల పాజిటివ్ కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది.
వ్యాక్సినేషన్లో ముందున్నప్పటికీ..!
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ వేగంగా అందిస్తోంది. అక్కడ 18ఏళ్ల వయసున్న జనాభాలో 21శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందించింది. దేశ సరాసరి 9.9శాతం ఉండగా కేరళ అంతకుమించి పంపిణీ చేసింది. అయనప్పటికీ కరోనా కేసుల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ముఖ్యంగా ఐసీఎంఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే, కేరళలో మాత్రం 42.7శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 48శాతం కేరళ ప్రజలకు వైరస్ ముప్పు పొంచివుందనే అర్థమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అక్కడ ఎక్కువ కేసులు బయటపడుతున్నాయనే అనుమనం వ్యక్తం చేస్తున్నారు.
భారీ స్థాయిలో టెస్టులు..
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 5శాతానికన్నా తక్కువగా నమోదవుతున్నప్పటికీ కేరళలో మాత్రం గడిచిన 6వారాలుగా 10 నుంచి 12శాతం రికార్డవుతోంది. నిత్యం 10 నుంచి 15వేల మందిలో వైరస్ బయటపడుతోందని త్రివేండ్రం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. అయితే, ఆస్పత్రిలో చేరికలు మాత్రం కాస్త తగ్గాయని చెప్పారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండడంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వైరస్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవడం వైరస్ తీవ్రతను తగ్గించడంలో ఎంతగానో దోహదం చేస్తుందని సూచించారు.
కట్టడికి ప్రయత్నిస్తున్నాం..
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఊహించని రీతిలో పెరుగుతున్నమాట వాస్తవమేనని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ఏప్రిల్ మధ్య కాలంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందని.. మే 12న అత్యధికంగా 43వేల కేసులతో గరిష్ఠానికి చేరుకుందని చెప్పారు. అనంతరం తగ్గుతుందని భావించినప్పటికీ వైరస్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని అన్నారు. అయితే ఈ పాజిటివిటీ గ్రాఫ్ను తగ్గించేందుకు కృషిచేస్తున్నామని వీణా జార్జ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వయసుపైబడిన, మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండడం ప్రభుత్వానికి సవాలుగా మారిందన్నారు. అయినప్పటికీ వైరస్ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
వ్యాపారవేత్త, ‘షార్క్ ట్యాంక్’ కార్యక్రమం న్యాయనిర్ణేత వినీతా సింగ్ (Vineeta Singh) మరణించారని వస్తున్న వదంతులను ఆమె సోషల్ మీడియా వేదికగా తోసిపుచ్చారు. -
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..