Covid: కరోనా రోజూవారీ జీవితంలో భాగం కానుందా..?
అగ్రదేశం అమెరికాను డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం లక్షకు పైగా కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
అమెరికాలో విజృంభిస్తోన్న డెల్టా
త్వరలో గరిష్ఠస్థాయికి మహమ్మారి
వాషింగ్టన్: అగ్రదేశం అమెరికాను డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం లక్షకు పైగా కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. త్వరలో వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఏమాత్రం ఉదాసీనత వద్దని ప్రజలు, అధికారుల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఈ వైరస్ రోజువారీ జీవితంలో భాగం కానుందని, ఒక ఫ్లూ మాదిరిగా ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోనుందని అంటున్నారు.
అమెరికాలో నిత్యం లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రోజువారీ కేసుల వృద్ధి కాస్త మందగించడం, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ, ఇప్పటికీ నమోదవుతోన్న సంఖ్య ఏమాత్రం తక్కువ కాదని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోజుకు సుమారు 1,800 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షమందికి పైగా కొవిడ్ తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీకాలు తీసుకోని వారిలోనే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఇప్పటికే అక్కడి వైద్యులు గుర్తించారు. తప్పుడు సమాచారం కారణంగా కొందరిలో టీకాలపై అనుమానాలు నెలకొన్నాయి. దాంతో వారికి టీకాలు వేయడం అధికారులకు సవాలుగా మారుతోంది.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హన్సోటీ మాట్లాడుతూ.. మునుపటి ముప్పు నుంచి మనం నేర్చుకోకపోతే మరోసారి వైరస్ విజృంభించే అవకాశం ఉందన్నారు. వైరస్లో కొత్త రకాలతోపాటు శీతకాలం ప్రారంభం కావడంతో చల్లని వాతావరణం కారణంగా ఇంటిలోపలే ఎక్కువ సేపు ఉండాల్సి రావడం మరో ముప్పునకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. శీతకాలంలో వైరస్ గరిష్ఠ స్థాయికి చేరి తగ్గడం, మళ్లీ పెరగడం.. ఇలాంటి సందర్భాలున్నాయని కెనడాకు చెందిన వైరాలజిస్టు ఏంజెలా రాస్ముస్సెన్ అన్నారు. ఈ ముప్పు నేపథ్యంలో జనాభాలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందడం ఆవశ్యకమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అర్హులైన జనాభా(12 ఏళ్లు పైబడినవారు)లో 63.1 శాతం మందికి పూర్తిగా టీకాలు అందాయి. మొత్తం జనాభా పరంగా చూసుకుంటే అది 54 శాతంగా ఉంది. అమెరికాలో టీకాల లభ్యత సమృద్ధిగా ఉన్నప్పటికీ.. పోర్చుగల్(81 శాతం), యూఏఈ(79 శాతం) కంటే వెనుకబడే ఉండటం గమనార్హం.
వ్యాక్సినేషన్తో పాటుగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యలపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ హాట్స్పాట్లలో ప్రజలు మాస్క్లు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని చెప్తున్నారు. అలాగే పాఠశాలలు, వ్యాపార కార్యకలాపాలు సాగేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని చెప్తున్నారు. ఇంకోపక్క వైరస్ సహజ సంక్రమణ, టీకాలు తీసుకోవడం వల్ల వచ్చిన నిరోధకతతో దేశం హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వీటిపై ఏంజెలా స్పందించారు. హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువైనట్లు ఇప్పుడే ప్రకటించడం తొందరపాటే అవుతుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వయోజనుల్లో వ్యాక్సినేషన్ రేటు 50 శాతం కంటే తక్కువగానే ఉందని గుర్తుచేశారు.
ఎండెమిక్గా మారనుందా..?
కొత్త రకాలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. వాటిలో డెల్టా ప్రభావం తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో మ్యుటేషన్ల కారణంగా కొత్త వేరియంట్లకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే టీకాలే వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని, రాబోయే రోజుల్లో పిల్లలకు టీకాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు. వృద్ధులు, బలహీన రోగ నిరోధక శక్తి ఉన్నవ్యక్తుల్ని బూస్టర్ డోసులు ఆదుకుంటాయని భావిస్తున్నారు. అయితే ఈ వైరస్ను పూర్తిగా నిర్మూలించడం వీలుకాకపోవచ్చని, ఇది ఎండెమిక్(వ్యాధి ఒక దేశం, ఒక ప్రాంతానికే పరిమితమవడం, ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి)గా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో ఇది ఫ్లూ మాదిరిగా ఉందన్నారు. అయితే దీనిపై వారు స్పష్టమైన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి