Omicron: చాపకింద నీరులా ఒమిక్రాన్.. ఆంక్షల వలయంలోకి పలు దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే భయపెడుతున్న డెల్టా వేరియంట్ సహా తాజా ఒమిక్రాన్ కేసులు కలవరపెడున్నాయి......
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కలవరపెడున్న డెల్టా వేరియంట్ సహా తాజా ఒమిక్రాన్ కేసులు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో పలు దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. అమెరికాలో మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండోర్ ప్రాంతాల్లో మాస్క్లు తప్పనిసరి చేసే అవకాశమున్నట్టు అక్కడి గవర్నర్ కాథి హోచుల్ ప్రకటించారు. కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి.. మాస్క్ తప్పనిసరి అనే ఆదేశాలను అమలు చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని హోచుల్ పేర్కొన్నారు. 2020 ఏప్రిల్లో న్యూయార్క్లో మాస్క్ తప్పనిసరి చేశారు. ఆ తర్వాత టీకా తీసుకున్న వారికి మాస్క్ అవసరం లేదని 2021 జూన్లో ప్రకటించారు. తాజాగా కేసుల పెరుగుదలతో మరికొద్ది రోజులపాటు మాస్క్ తప్పనిసరి నిబంధనను అమలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వ్యాక్సినేషన్ పాస్లు తప్పనిసరి
కరోనా వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలను శుక్రవారం నుంచి బ్రిటన్ అమలులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలను అధికారులే ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వస్తున్న క్రమంలో ప్రధాని బోరిస్ జాన్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ను అదుపు చేసేందుకు ఇండోర్ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. నైట్క్లబ్స్, భారీ కార్యక్రమాల్లో వ్యాక్సినేషన్ పాసులు తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించారు. వీలైతే ఉద్యోగులకు ఇంటి నుంచి పని వంటివి అమలు చేయాలని సూచించారు.
ఆంక్షలను పొడిగించిన ఇజ్రాయెల్
విదేశీయులు దేశంలోకి ప్రవేశించటంపై నిషేధంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలపై కఠిన ఆంక్షలను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఆంక్షలు పొడిగించినట్లు ప్రధాని నెఫ్తాలి బెన్నెట్, ఆరోగ్య మంత్రి నిట్జాన్ హోరోవిట్జ్ తెలిపారు. ఇజ్రాయెల్ బెన్-గురియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు డిసెంబర్ 22 వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే స్వదేశీ ప్రయాణికులు కొవిడ్ పీసీఆర్ టెస్ట్లో నెగెటివ్ వచ్చే వరకు సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉండాలని స్పష్టం చేశారు.
దక్షిణ కొరియాలో రోజుకు 7వేల కేసులు
దక్షిణ కొరియాపై కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. వరుసగా మూడో రోజు 7వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి.. ఇప్పుడే అత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది. అయితే కేసులు పెరుగుతున్నా.. ఆంక్షల వైపు ప్రభుత్వం మొగ్గు చూపకపోవటంపై విమర్శలు ఎదురవుతున్నాయి. డెల్టా వేరియంట్ టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో బూస్టర్ డోస్లకు డిమాండ్ పెరుగుతోంది. ఒమిక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో మూడో డోసు ఆవశ్యకత మరింత పెరిగింది. కొవిడ్ అదుపులోకి రాకపోతే.. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని కిమ్ బూ క్యూమ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి