Vaccines Safe for Cancer Patients: క్యాన్సర్ రోగులకు టీకాలు సురక్షితమే..!
క్యాన్సర్ రోగులపై జరిపిన అధ్యయనాల్లో కొవిడ్ వ్యాక్సిన్లు వారికి సురక్షితమేనని వెల్లడైంది. సామాన్యుల్లో మాదిరిగానే తీవ్రమైన దుష్ర్పభావాలు కనిపించలేదని.. రోగనిరోధక ప్రతిస్పందనలు మెరుగుగా ఉంటున్నట్లు తేలింది.
తాజా అధ్యయనాల్లో వెల్లడి
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లన్నీ సమర్థంగానే పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై అవి ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా క్యాన్సర్ రోగులపై జరిపిన అధ్యయనాల్లో కొవిడ్ వ్యాక్సిన్లు వారికి సురక్షితమేనని వెల్లడైంది. సామాన్యుల్లో మాదిరిగానే తీవ్రమైన దుష్ర్పభావాలు కనిపించలేదని.. రోగనిరోధక ప్రతిస్పందనలు మెరుగుగా ఉంటున్నట్లు తేలింది. ఇలాంటి రోగులకు బూస్టర్ డోసు ఇవ్వడం ద్వారా మరింత రక్షణ కల్పించవచ్చని తాజాగా వర్చువల్ పద్ధతిలో జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ (ESMO) వార్షిక సమావేశంలో అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు.
కీమోథెరపీ తీసుకునే వారిలోనూ..
కరోనా వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో అన్ని వయసుల వారిపై ప్రయోగాలు జరిపినప్పటికీ.. క్యాన్సర్ రోగులపై ప్రత్యేకంగా వీటిని ప్రయోగించలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ను ఎదుర్కొనే ఔషధాలను ఉపయోగించడం వల్ల వారిలో రోగనిరోధకత తగ్గడమే ఇందుకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ రోగుల్లో కరోనా వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు యూరప్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్లోని వివిధ ఆస్పత్రులకు చెందిన 791 వాలంటీర్లను పరిగణలోకి తీసుకున్నారు. వీరిలో సాధారణ రోగులు, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ తీసుకున్న క్యాన్సర్ బాధితులు ఉన్నారు. వీరికి మోడెర్నా టీకా రెండు డోసులను ఇచ్చి పరీక్షించారు.
రెండో డోసు ఇచ్చిన 28రోజుల తర్వాత వారిని పరీక్షించగా కీమోథెరపీ తీసుకున్న 84శాతం మందిలో వైరస్ను ఎదుర్కొనే యాండీబాడీలు వృద్ధి అయినట్లు గుర్తించారు. ఇక కీమో-ఇమ్యూనోథెరపీ తీసుకున్న 89శాతం మందిలో, కేవలం ఇమ్యూనోథెరపీ తీసుకున్న 93శాతం మందిలోనూ కొవిడ్ యాంటీబాడీలు అవసరమైన స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. క్యాన్సర్ రోగులు కానీ వారిలో ఇవి 99శాతం ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. క్యాన్సర్ను ఎదుర్కొనే ఏ విధమైన చికిత్స తీసుకున్నా.. వారిలో వ్యాక్సిన్ల సామర్థ్యం స్పష్టంగా కనిపించిందని ఇటలీలోని యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి చెందిన నిపుణులు ఆంటోనియో పసారో పేర్కొన్నారు. క్యాన్సర్ రోగుల్లో కొవిడ్-19 వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని ఉద్ఘాటించారు.
అన్ని అధ్యయనాల్లోనూ అవే ఫలితాలు..
క్యాన్సర్ రోగులపై ఇజ్రాయెల్లో జరిపిన అధ్యయనంలోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. అక్కడ 232 మంది క్యాన్సర్ రోగులకు, 261 కంట్రోల్ గ్రూపునకు (సాధారణ వ్యక్తులు) ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చి పరీక్షించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. ఇక బ్రిటన్లో 585 మంది క్యాన్సర్ రోగులపై జరిపిన మరో అధ్యయనంలోనూ మెరుగైన ఫలితాలే కనిపించాయి. ఇజ్రాయెల్లో ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న క్యాన్సర్ రోగుల్లో కొవిడ్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కనుగొన్నారు. ఇక కొవిడ్ బారినపడిన క్యాన్సర్ రోగుల్లోనూ తొలి డోసు తీసుకున్న తర్వాత కరోనాను ఎదుర్కొనే రోగనిరోధకత మరింత పెరిగినట్లు మరో అధ్యయనం ద్వారా నిపుణులు అంచనా వేశారు. ఈ నాలుగు అధ్యయనాల నివేదికలను తాజాగా వర్చువల్ పద్ధతిలో జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ (ESMO) వార్షిక సమావేశంలో నిపుణులు వెల్లడించారు. సాధారణ ప్రజల మాదిరిగానే క్యాన్సర్ బాధితులకు కరోనా వైరస్ నుంచి వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే విషయం తెలుస్తోందని ESMOకి చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ లూయిస్ క్యాస్టెలో-బ్రాన్కో స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ