Covid impact: బడుల మూతతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం: ప్రపంచ బ్యాంకు
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు భారీస్థాయిలో అభ్యాసన నష్టం వాటిల్లిందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది......
ఆందోళనకర విషయాల వెల్లడి
వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు భారీస్థాయిలో అభ్యాసన నష్టం వాటిల్లిందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షల మంది భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని పేర్కొంది. కొవిడ్ కారణంగా ఈ తరం విద్యార్థులు ప్రస్తుత విలువ ప్రకారం.. తమ జీవితకాలంలో ఆర్జించే 17 లక్షల కోట్ల డాలర్ల సంపాదనను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. గతేడాది అంచనా వేసిన 10 లక్షల కోట్ల డాలర్ల నష్టానికి మించి ఇది నమోదైనట్లు వెల్లడించింది. ఇది ప్రపంచ జీడీపీలో సుమారు 14 శాతమని వివరించింది. భారత్లోని పరిస్థితులపైనా ఇందులో ప్రస్తావించింది.
లాక్డౌన్ పరిస్థితుల్లో విద్యారంగంపై పడిన దుష్ప్రభావానికి సంబంధించి ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్: ఏ పాత్ టు రికవరీ రిపోర్ట్’ పేరుతో ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను విడుదల చేసింది. యునెస్కో, యూనిసెఫ్ సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
* కరోనాకు ముందు అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని 53 శాతం మంది విద్యార్థులు విద్యావకాశాలకు దూరంగా ఉండగా, లాక్డౌన్లో అది 70 శాతానికి పెరిగింది. దీర్ఘకాలంపాటు పాఠశాలల మూసివేత, ఆన్లైన్ తరగతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.
* కొవిడ్ సంక్షోభం మొదలై సుమారు 21 నెలలు గడిచినా.. ఇప్పటికీ పెద్దఎత్తున స్కూళ్లు తెరవకపోవడంతో లక్షల మంది పిల్లలు విద్యాభ్యాసానికి దూరమయ్యారు. ప్రస్తుత తరానికి జరుగుతున్న అభ్యాసన నష్టం వల్ల భవిష్యత్తులో ఉత్పాదకత ఆందోళనకరస్థాయిలో పడిపోనుంది. ఫలితంగా వారి సంపాదనతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడనుంది.
* బడులకు దూరం కావడం వల్ల గ్రామీణ భారతంతో పాటు పాకిస్థాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, మెక్సికో తదితర దేశాల్లో విద్యార్థులు గణితంతో పాటు చదవడంలోనూ బాగా వెనుకబడ్డారు. విద్యార్థుల అభ్యాసన నష్టానికి.. పాఠశాలల మూసివేతతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తేలింది. అయితే విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, జెండర్ తదితర అంశాలు కూడా అభ్యాసన నష్టం స్థాయి పెరగడానికి కారణమయ్యాయి.
* విద్యారంగానికి ఉపశమనం కలిగించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీల్లో 3 శాతం కంటే తక్కువే కేటాయించాయి. ఆ వాటాను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచంలోని అన్ని దేశాలు తమ విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్ అవకాశాలను అందిస్తున్నప్పటికీ.. అందులో నాణ్యతను పాటించడం లేదని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అల్పాదాయ, అత్యల్పాదాయ దేశాల్లోని 20 కోట్ల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన ఆన్లైన్ బోధన అందలేదని పేర్కొంది. ముందుతరం వారికి సాటిగా.. ప్రస్తుత విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వెంటనే పాఠశాలలను తెరవాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు సూచించింది. విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక బోధన పద్ధతులు అనుసరించాలని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.