Afghanistan: అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపు
భారత రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు కాబూల్లోని భారత పౌరుల ప్రాణాలను అవసరమైన సమయంలో స్వదేశానికి తరలించే ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
కాబూల్: అఫ్గానిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. దీంతో కాబూల్లో ఉద్రిక్త, భయానక వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలు దిల్లీ-కాబూల్ మధ్య నడిచే విమాన సర్వీసులపై పడ్డాయి. ‘ప్రస్తుతం అఫ్గాన్లో వేగంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. భారత రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు కాబూల్లోని భారత పౌరుల ప్రాణాలను పణంగా పెట్టం’ అని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. వారిని అవసరమైన సమయంలో స్వదేశానికి తరలించే ఏర్పాట్లతో ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. ఇందుకోసం భారత వాయుసేనకు చెందిన C-17 విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.
ఎయిరిండియా విమానంపై ఉత్కంఠ..
దిల్లీ నుంచి కాబూల్కు ఆదివారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానం బయలుదేరిన సమయంలో అఫ్గానిస్థాన్లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికే కాబూల్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారనే ప్రకటన వెలుబడింది. అదే సమయంలో కాబూల్ ఎయిర్పోర్టులో విమానానికి అనుమతిచ్చేందుకు ఏటీసీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తమైన ఎయిరిండియా పైలట్.. శత్రువులకు లక్ష్యంగా కాకుండా ఉండేందుకు విమాన రాడార్ వ్యవస్థను ఆఫ్ చేశారు. చివరకు గంట ఆలస్యంగా కాబూల్ ఎయిర్పోర్టులో విమానం దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ అదే విమానం 129 ప్రయాణికులతో దిల్లీకి చేరుకుంది.
ఇదిలాఉంటే, అఫ్గానిస్థాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. తాలిబన్ల ప్రతినిధులు మాత్రం తాము కాబూల్ను బలవంతంగా ఆక్రమించే ఉద్దేశం లేదని పేర్కొంటున్నారు. కాబూల్ వాసులు ఎటువంటి భయభ్రాంతులకు గురికావద్దని.. ప్రతీకారం తీర్చుకోవడానికి నగరంలోని ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం తమకు లేదని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అధికార బదలాయింపు శాంతియుతంగా జరిగే అవకాశం ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్ మిర్జక్వాల్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు