Delhi: పంద్రాగస్టు ముందు దిల్లీలో భారీ కుట్ర భగ్నం.. 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో దేశ రాజధానిలో ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు

Updated : 13 Aug 2021 17:25 IST

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో దేశ రాజధానిలో ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పత్ర్యేక బ్రాంచ్‌ పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 55 పిస్టోళ్లు, 50 లైవ్‌ బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఒకరు దిల్లీ వాసి కాగా.. మిగతా వారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారిగా తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని