ఉపరాష్ట్రపతి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్‌ ప్రభాకర్‌పై కేసు నమోదు

వైకాపా ఎన్‌ఆర్‌ఐ సభ్యుడు పంచ్‌ ప్రభాకర్‌పై దిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి...

Updated : 17 Aug 2021 15:37 IST

దిల్లీ: వైకాపా ఎన్‌ఆర్‌ఐ సభ్యుడు పంచ్‌ ప్రభాకర్‌పై దిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సహా పలువురు ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌లో పోస్టులు పెట్టారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు దిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో యూట్యూబ్‌పైనా కేసు నమోదు చేసిన స్పెషల్‌ సెల్‌ పోలీసులు సంస్థకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా పంచ్‌ ప్రభాకర్‌ వీడియోలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని యూట్యూబ్‌ను ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్పెషల్‌ సెల్‌ పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని