CJI: మధుమేహ వైద్యానికి రాయితీలివ్వాలి: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
మధుమేహం ఖరీదైన వ్యాధిగా మారినందున దీని చికిత్స, మందులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు.
ఈనాడు, దిల్లీ: మధుమేహం ఖరీదైన వ్యాధిగా మారినందున దీని చికిత్స, మందులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. ఇది ధనికులకు వచ్చే వ్యాధి అన్న అపోహ ప్రజల్లో ఉందని, కానీ వాస్తవంగా ఇది పేదవారి శత్రువు అని అభివర్ణించారు. మధుమేహంపై ఆదివారం నిర్వహించిన అహుజా బజాజ్ 8వ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఆధునిక జీవనశైలి కారణంగా పుట్టుకొచ్చిన మధుమేహాన్ని డాక్టర్లు, పరిశోధకులు ‘అవకాశవాద మృత్యువు’గా అభివర్ణిస్తున్నారు. ఇది జీవితాంతం వెంటాడే రోగం. దీనికోసం వాడే మందులు, ఇన్సులిన్లు దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలు కూడా దీనిబారిన పడుతున్నారు. అందుబాటు ధరల్లో వైద్యసౌకర్యాలు లేకపోవడం, అవగాహన కొరవడటం వల్ల ఇది ముదిరిపోయే వరకు సమస్యను గుర్తించలేని పరిస్థితి నెలకొంది.
అందువల్ల ప్రభుత్వాలు చికిత్సలకు, మందులకు రాయితీలు ఇవ్వాలి. నేను కూడా ఒత్తిడితో కూడిన ఈ న్యాయవృత్తిని కాకుండా మరోదైనా వృత్తిని ఎంచుకొని ఉంటే దీని చికిత్స కోసం డాక్టర్లను ఒత్తిడిచేసే పని ఉండేదికాదేమో అనిపిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారమంతా పాశ్చాత్య దేశాల పరిశోధనల ఆధారంగా రూపొందించిందే. అందువల్ల భారత పరిస్థితులపై దృష్టి సారించి అధ్యయనాలు చేయాలి. ఇప్పటికీ మనం రక్తంలో గ్లూకోజు స్థాయిని ప్రామాణీకరించలేకపోవడం దురదృష్టకరం. ఆధునిక మందులు కనిపెట్టి ఈ రోగాన్ని నివారించేందుకు ప్రయత్నించాలి. గత 30 ఏళ్లుగా నేను ఒకే మందే వాడుతున్నా. దీన్ని సంపూర్ణంగా నియంత్రించే విధానం రావాలన్నదే నా ఆకాంక్ష’’ అని జస్టిస్ రమణ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్