Omicron: తొలుత యూరప్ నుంచి వచ్చిన రాయబారుల్లోనే ఒమిక్రాన్!
యూరప్ నుంచి వచ్చిన రాయబారుల్లోనే నలుగురి మొదట పాజిటివ్గా గుర్తించామని బోట్స్వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి వెల్లడించారు.
ఆంక్షలపై మండిపడ్డ బోట్స్వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి
గాబొరోన్: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసినట్లు ఆ దేశం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమవుతున్న ప్రపంచ దేశాలు దక్షిణాఫ్రికాతో పాటు పలు ఆఫ్రికా దేశాల ప్రయాణాలపై ఆంక్షలు మొదలుపెట్టాయి. వీటిని బోట్స్వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వేరియంట్ తమ దేశంలో వెలుగు చూసినప్పటికీ.. యూరప్ నుంచి వచ్చిన రాయబారుల్లోనే నలుగురి మొదట పాజిటివ్గా గుర్తించామని వెల్లడించారు.
‘‘వివిధ దేశాలకు చెందిన రాయబారులు చాలా దేశాల్లో పర్యటించారు. అందులో భాగంగా బోట్స్వానాకు వచ్చారు. అందులో నవంబర్ 7న వచ్చిన నలుగురిలో ఈ వేరియంట్ గుర్తించాం’’ అని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోట్స్వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి వెల్లడించారు. వారు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని వెల్లడించేందుకు నిరాకరించిన ఆయన.. యూరప్ నుంచి వచ్చిన వారేనా అని అడిగిన ప్రశ్నకు ఔనని సమాధానం ఇచ్చారు.
బోట్సోవానాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్.. డెల్టాతో పోలిస్తే భిన్నంగా ఉందని అక్కడి అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అందులోని స్పైక్ ప్రొటీన్లలో మ్యుటేషన్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే ఈ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థకు అందజేశారు. వీటిని విశ్లేషించిన డబ్ల్యూహెచ్ఓ ఈ కొత్త వేరియంట్ను ఆందోళనకర రకంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆఫ్రికా దేశాలపై ఆంక్షలు మొదలుపెట్టాయి. దీన్ని తీవ్రంగా ఖండించిన బోట్స్వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి.. అసలు ఈ వేరియంట్ గురించి తొలుత చెప్పడమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా