
FEMA probe: బ్యాంకు మాజీ ఛైర్మన్పై ఈడీ కొరడా.. రూ. 294కోట్ల ఆస్తులు జప్తు
దిల్లీ: తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ నేసమణిమారన్ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా చట్టం 1999 కింద మారన్కు చెందిన రూ.293.91 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తులు.. నాలుగు భారతీయ కంపెనీలైన సదరన్ అగ్రిఫ్యూరేన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజీఎమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజీఎం డైమండ్ బీచ్ రీసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో షేర్ల రూపంలో ఉన్నాయని తెలిపారు.
2005-06, 2006-07 ఆర్థిక సంవత్సరంలో సింగపుర్లోని సంస్థల్లో రూ.293.91 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. ‘ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోకుండానే మారన్ ఈ పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో ఇంత భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని భారత నియంత్రణ సంస్థలకు వెల్లడించలేదు’ అని ఈడీ తెలిపింది.