Omicron variant: కొత్త వేరియంట్పై ఆందోళన.. వారిపై నిఘా పెంచండి!
ఆందోళనకర వేరియంట్ వెలుగు చూసిన దేశాలను ‘ప్రమాదం’ కేటగిరి జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై అదనపు పర్యవేక్షణ ఉంచాలని పేర్కొంది.
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు
దిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్తో ఆందోళన చెందుతోన్న ప్రపంచ దేశాలు.. మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే విదేశీయుల రాకపై ఇజ్రాయెల్ నిషేధం విధించగా.. మరికొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. ఇలా కొత్త వేరియంట్పై ఆందోళనలు మొదలైన నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ఆందోళనకర వేరియంట్ వెలుగు చూసిన దేశాలను ‘ప్రమాదం’ కేటగిరి జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై అదనపు పర్యవేక్షణ ఉంచాలని పేర్కొంది. వీటితో పాటు కొవిడ్ కట్టడి చర్యలు, టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ కవరేజ్ను మరింత పెంచాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. స్థానికంగా కొవిడ్ హాట్స్పాట్ల పర్యవేక్షణతో పాటు పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు తక్షణమే పంపించాలని స్పష్టం చేసింది. వీటికి సంబంధించి అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మరోసారి లేఖ రాశారు.
* ఆందోళనకర వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన దేశాలను ఇప్పటికే ప్రమాదం పొంచి ఉన్న కేటగిరిలో చేర్చాం. అటువంటి దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై అదనపు పర్యవేక్షణ ఉంచాలి
* ఈ ఆందోళనకర వేరియంట్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కఠినమైన కట్టడి, క్రియాశీల నిఘా, వ్యాక్సినేషన్ను పెంచడం, కొవిడ్ నిబంధనలను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయడం అత్యవసరం
* అంతర్జాతీయ విమానాల్లో భారత్ వచ్చే ప్రయాణికుల గత ప్రయాణ వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన ‘రిపోర్టింగ్ మెకానిజం’ ఉంది. దీనిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా స్థాయిలో సమీక్షించుకోవాలి
* ఈ కొత్త వేరియంట్ వల్ల వైరస్ విస్తృత పెరిగినట్లయితే.. దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన టెస్టింగ్ పరికరాలను సంసిద్ధం చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ టెస్టులు తగ్గినట్లు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు సరైన సంఖ్యలో లేకుంటే మహమ్మారి వాస్తవిక వ్యాప్తిని అంచనా వేయడం అత్యంత క్లిష్టమవుతుంది
* కొవిడ్ హాట్స్పాట్లు లేదా ఈమధ్య కొవిడ్ తీవ్రత పెరుగుతోన్న ప్రాంతాలపై పర్యవేక్షణ కొనసాగించాలి. ఆశించిన స్థాయిలో టెస్టింగ్లను చేయడంతో పాటు పాజిటివ్ వచ్చిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం తక్షణమే సమీప ల్యాబ్కు పంపించాలి
* కొవిడ్ పాజిటివిటి రేటు 5శాతం కంటే దిగువనే ఉండే విధంగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలి. ఇందుకోసం కొవిడ్ టెస్టులను గణనీయంగా పెంచడం, ఆర్టీపీసీఆర్ల సంఖ్యను పెంచుకోవాలి
* బాధితులకు మెరుగైన చికిత్సలో ఆలస్యం కలగకుండా అవసరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను రాష్ట్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకు అనుగుణంగానే కేంద్ర ఇచ్చే నిధులను రాష్ట్రాలను సద్వినియోగం చేసుకోవాలి
* దేశంలో కొత్త వేరియంట్ల ఉనికిపై ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్సాకోగ్ (INSACOG) ఏర్పాటు అయ్యింది. సాధారణ పౌరుల నుంచి తీసుకునే నమూనాలను ఇన్సాకోగ్కు వెంటవెంటనే పంపించాలి
* సెకండ్ వేవ్ సమయంలో కొవిడ్పై దేశవ్యాప్తంగా అసత్య వార్తల ప్రభావం అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో అటువంటి అపోహలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అనుమానాలు నివృత్తి చేస్తూ ప్రజలకు అవగాహన కలిగించాలి
* ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్ కేసులు ఇప్పటికే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోత్సువానా, ఇజ్రాయెల్, హాంకాంగ్ దేశాలకు వ్యాపించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి