
COVID-19 Pill: కరోనా మాత్ర వినియోగానికి సానుకూలంగా అమెరికా!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘మెర్క్’ రూపొందించిన కొవిడ్ ఔషధం ‘మోల్నూపిరవిర్’ వినియోగంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ)కు చెందిన ఆరోగ్య సలహాదారుల కమిటీ సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ ఔషధం త్వరలోనే అమెరికా పౌరులు వినియోగించేందుకు మార్గం సుగమం కానుంది. గర్భాధారణ సమయంలో ఈ ఔషధాన్ని వినియోగిస్తే.. శిశువులకు పుట్టుకతో వచ్చే ఎలాంటి లోపాలు రావని, వివిధ ముప్పులను అధిగమిస్తుందని కమిటీలోని 13-10 మంది ఓటు వేశారు. ఈ మాత్ర ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగిన తర్వాత ఈ మేరకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ఔషధాన్ని గర్భిణులు ఉపయోగించే విషయంపై దృష్టిసారించాలని ఎఫ్డీఏకు కమిటీ సూచించింది.
ఆస్తమా, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారితోపాటు అత్యధిక ముప్పును ఎదుర్కొనే వయోజనులు ఈ ఔషధం ఉపయోగించవచ్చని కమిటీ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చా? వద్దా? అన్నదానిపై పరిశోధన కొనసాగుతున్న నేపథ్యంలో.. వారు ఈ మాత్రను వినియోగించకూడదని కమిటీలో చాలా మంది సభ్యులు పేర్కొన్నారు. మోల్నూపిరవిర్ మాత్రపై ప్యానెల్ చేసిన సూచనలపై ఎఫ్డీఏ పూర్తిగా ఆధారపడదని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ఔషధ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపే విషయంపై సొంతంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
కరోనాను ఎదుర్కోవడంలో మోల్నుపిరవిర్ సమర్థంగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కోగలదా? లేదా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఒమిక్రాన్పై ఈ పిల్ సామర్థ్యాన్ని ఇంకా పరిశీలించనప్పటికీ.. కొంతమేర ప్రభావవంతంగానే పనిచేస్తుందని వారు భావిస్తున్నారు. ‘కరోనా కొత్త వేరియంట్లను మోల్నుపిరవిర్ ఎదుర్కొంటుందనడానికి ఆధారం లేదు. దీని గురించి ప్రకటించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని చార్లెస్ డ్రూ యూనివర్సిటీ స్కూల్ మెడిసిన్ అండ్ సైన్సెస్కు చెందిన డాక్టర్ డేవిడ్ హార్డీ అభిప్రాయపడ్డారు. ఎఫ్డీఏ ఆరోగ్య నిపుణుల కమిటీలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
PM Modi: గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
-
India News
India Corona: 16 వేల కొత్త కేసులు..24 మరణాలు
-
India News
హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 16 మంది దుర్మరణం
-
General News
Chiranjeevi: భీమవరం చేరుకున్న చిరంజీవి.. అభిమానుల ఘనస్వాగతం
-
Business News
Stock Market Update: ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Politics News
Raghurama: నా శ్రేయోభిలాషుల కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నా: రఘురామ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్స్టోక్స్ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య