Omicron: దేశంలో మరో 8 ఒమిక్రాన్ కేసులు..49కి చేరిన బాధితుల సంఖ్య
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా తన ఉనికి చాటుతోంది. మంగళవారం దిల్లీ, రాజస్థాన్లో చెరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశవ్యాప్తంగా ఈ రకం కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం దిల్లీలో ఒమిక్రాన్ కేసులు ఆరుకు చేరగా.. రాజస్థాన్లో 13కు పెరిగాయి. దీనిపై ఆయా ఆరోగ్య శాఖ మంత్రులు స్పందించారు.
దిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. మంగళవారం దిల్లీలో నాలుగు, రాజస్థాన్లో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశవ్యాప్తంగా ఈ రకం కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం దిల్లీలో ఒమిక్రాన్ కేసులు ఆరుకు చేరగా.. రాజస్థాన్లో 13కు పెరిగాయి. దీనిపై ఆయా ఆరోగ్య శాఖ మంత్రులు స్పందించారు.
‘దిల్లీలో మరో నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. దాంతో ఆ వేరియంట్ బాధితుల సంఖ్య ఆరుకి చేరింది. వీరిలో ఓ వ్యక్తి కోలుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 35 మంది కొవిడ్ బాధితులు, ముగ్గురు కొవిడ్ అనుమానితులు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేరారు’ అని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. రాజస్థాన్లో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్సాడీ లాల్ మీనా వెల్లడించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఇంతకుముందున్న ఒమిక్రాన్ బాధితులందరికీ కొవిడ్ నెగెటివ్గా తేలినట్లు చెప్పారు.
డిసెంబర్ 2న కర్ణాటకలో తొలుత ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించారు. ఈ 12 రోజుల వ్యవధిలో ఆ వేరియంట్ పలు రాష్ట్రాలకు వ్యాపించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 20 మందిలో వెలుగుచూసింది. ఇదిలా ఉండగా.. గత నెల మొదట దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్.. ఇప్పటికే 60కి పైగా దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం