Suicide: ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం.. ఆకలితో చిన్నారి కన్నుమూత

ఇద్దరు పసిబిడ్డలను విధికి వదిలేసి ఆ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక పసిప్రాణం ఆకలికి తాళలేక కన్నుమూయడం విషాదాన్ని మరింత పెంచింది.

Updated : 18 Sep 2021 11:16 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ఇద్దరు పసిబిడ్డలను విధికి వదిలేసి ఆ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక పసిప్రాణం ఆకలికి తాళలేక కన్నుమూయడం విషాదాన్ని మరింత పెంచింది. ఈ దుర్ఘటన బెంగళూరు తిగళరపాళ్య చేతన్‌ కూడలి వద్దనున్న శంకర్‌ కుటుంబంలో పూడ్చలేని అగాథాన్ని సృష్టించింది. పుట్టింటినుంచి అత్తింటికి వెళ్లాలంటూ ఇంటి పెద్ద.. కుమార్తెకు చెప్పడమే పెనువిషాదానికి కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. భారతి(50), ఆమె కుమార్తెలు సించన(33), సింధురాణి(30), కుమారుడు మధుసాగర(27) ఆత్మహత్య చేసుకున్నారు. సించన తొమ్మిది నెలల కుమారుడు ఆకలి తాళలేక మరణించాడు. ఆమె కుమార్తె ప్రేక్ష(3) స్పృహ కోల్పోయింది. బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండో కాన్పునకు వచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించాక అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించనను తండ్రి శంకర్‌ కోరుతున్నారు. దీనిపైనే కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు. తన మాట ఎవరూ వినడం లేదని శంకర్‌ ఆదివారం ఇంటినుంచి వెళ్లి బంధువుల ఇళ్లలో కాలం గడిపారు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి అనుమానంతో కిటికీనుంచి చూసి ఆయన నిశ్చేష్టులయ్యారు. కుటుంబీకులు 5రోజుల కిందటే ఉరేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని