LPG cylinder: గుదిబండగా మారిన గ్యాస్‌బండ.. మరోసారి పెరిగిన ధర

మరోసారి వంటగ్యాస్ ధర మంట మండింది. సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెరిగి, మరింత భారంగా మారింది. ఈ ధరలు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు బుధవారం ఓ వార్తా సంస్థ వెల్లడించింది. 

Updated : 18 Aug 2021 12:55 IST

దిల్లీ: మరోసారి వంటగ్యాస్ ధర మంట మండింది. సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెరిగింది. ఈ ధరలు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు బుధవారం ఓ వార్తా సంస్థ వెల్లడించింది. 

కొత్త ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దిల్లీ, ముంబయిలో ఒక సిలిండర్ ధర రూ.859.50గా ఉంది. కోల్‌కతాలో అత్యధికంగా రూ.886కి చేరుకుంది. ఇప్పటికే జులై 1న ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి. మరోపక్క దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గ్యాస్‌ ధరలో పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12 వరకు సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని