Sudan: సూడాన్లో కూలిన బంగారు గని: 38 మంది మృతి
ఆఫ్రికా దేశమైన సూడాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని కూలి 38 మంది చనిపోయారు. ఈ విషయాన్ని సూడాన్
సూడాన్: ఆఫ్రికా దేశమైన సూడాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని కూలి 38 మంది చనిపోయారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సూడాన్ రాజధాని ఖార్టోమ్కు 700 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివేసిన బంగారు గనిలో ఈ ఘటన జరిగినట్లు సూడాన్ మైనింగ్ కంపెనీ తెలిపింది. ఎనిమిది మంది మంది గాయపడినట్లు వెల్లడించింది.
గత కొంతకాలం క్రితం ఈ గని తవ్వకాన్ని ప్రభుత్వం మూసివేసింది. అయితే బంగారం కోసం స్థానిక ప్రజలు తరుచుగా గనిలోకి వెళుతుంటారు. గనులు కూలకుండా ఉండేందుకు ప్రభుత్వం కనీస భద్రతా సౌకర్యాలు సైతం కల్పించడం లేదు. దీంతో సూడాన్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో బంగారం వెలికితీసే దేశాల్లో సూడాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. 2020లో ఈ దేశం 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?