Parliament: 18న అఖిలపక్ష భేటీ!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
దిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సమావేశాలకు ముందురోజు (ఆదివారం) ఈ భేటీ జరగనుంది. ఇందుకోసం పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు అన్ని రాజకీయ పార్టీలతో ఇటువంటి భేటీ జరగడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా సభలు సజావుగా జరిగేలా చూడాలని అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం ఎంపీలందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సూచించారు. ఇప్పటివరకూ 323 మంది ఎంపీలు వ్యాక్సిన్ను పూర్తిస్థాయిలో తీసుకోగా ఇతర ఆరోగ్య కారణాల వల్ల మరో 23 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. రెండు సభలు ఏకకాలంలోనే ఉదయం 11గంటలకు ప్రారంభమవుతాయని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్