Farm Laws Repeal: సాగుచట్టాల రద్దు.. ప్రక్రియ ఎలా ఉంటుందంటే!
ఇప్పటికే చట్టరూపం దాల్చుకున్న వాటిని రద్దు చేయాలంటే రాజ్యాంగ పరంగా ఎటువంటి విధానాన్ని అనుసరిస్తారు..?
చట్టాల రద్దు ప్రక్రియపై న్యాయ నిపుణులు చెబుతున్నది ఇదే..
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సాగు చట్టాలపై ఇప్పటికే సుప్రీం కోర్టు స్టే విధించింది. మరోవైపు ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చట్టరూపం దాల్చుకున్న వాటిని రద్దు చేయాలంటే రాజ్యాంగ పరంగా ఎటువంటి విధానాన్ని అనుసరిస్తారు..? దీనిపై న్యాయనిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
‘చట్టంగా మారిన దానిని రద్దు చేయాలంటే అవి రూపుదిద్దుకోవడానికి అవలంబించే పద్ధతినే అనుసరిస్తారు. చట్టాన్ని తేవాలన్నా.. దాన్ని రద్దు చేయాలన్నా కేవలం పార్లమెంటుకే ఆ అధికారం ఉంటుంది. సాధారణంగా ఏదైనా కొత్త చట్టాన్ని తెచ్చేందుకు పార్లమెంటులో ఏవిధంగానైతే బిల్లును ప్రవేశపెడుతారో.. చట్టం రద్దుకోసం అదే ప్రక్రియ ఉంటుంది. తాజాగా మూడు చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది’ అని న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా వెల్లడించారు. ఇది మినహా మరో మార్గం ఏమీ ఉండదని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య పేర్కొన్నారు.
అంతేకాకుండా కేవలం ఒక్క బిల్లుతోనే మూడు చట్టాలను ప్రభుత్వం రద్దు చేయగలదని పీకే మల్హోత్రా స్పష్టం చేశారు. అయితే, ఈ మూడు చట్టాలను ఎందుకు రద్దు చేస్తున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం ఆ బిల్లులో పలు కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఇలా ఆ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపితే.. అది కూడా ఓ చట్టంగా మారుతుంది. ఇప్పటివరకు ఆ మూడు చట్టాలు అమలు కాకపోయినప్పటికీ.. వాటికి పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినందున వాటిని ఇప్పటికీ చట్టంగానే పరిగణిస్తారు. అందుకే వాటిని కేవలం పార్లమెంటు ద్వారా మాత్రమే రద్దు చేయగలమని రాజ్యాంగ నిపుణులు పీకే మల్హోత్రా స్పష్టం చేశారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంటులో వీటిపై చర్చ జరగడంతో పాటు ఓటింగ్ను కూడా నిర్వహిస్తారని తెలిపారు.
ఇదిలాఉంటే, గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్రమోదీ.. కేవలం రైతుల ప్రయోజనాలకే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చామని గుర్తుచేశారు. వీటిపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నప్పటికీ ఈ విషయంలో రైతుల్లో ఓ వర్గాన్ని మాత్రం ఒప్పించలేకపోయామన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు మోదీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని ప్రధాని ప్రకటించారు. దీంతో ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.