Vaccine: మరో 66కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్

కరోనా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసే దిశగా  కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య సరఫరా చేసే నిమిత్తం.. తాజాగా మరో 66కోట్ల టీకా డోసులకు ఆర్డర్ ఇచ్చింది. సవరించిన టీకా విధానం కింద వీటిని సేకరిస్తోందని ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. 

Updated : 17 Jul 2021 17:49 IST

దిల్లీ: కరోనా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసే దిశగా  కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య సరఫరా చేసే నిమిత్తం.. తాజాగా మరో 66కోట్ల టీకా డోసులకు ఆర్డర్ ఇచ్చింది. సవరించిన టీకా విధానం కింద వీటిని సేకరిస్తోందని ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. 

జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన టీకా ధరల ప్రకారం.. ప్రభుత్వం కొవిషీల్డ్‌ ఒక్కడోసుకు రూ.205, కొవాగ్జిన్ ఒక్కడోసుకు రూ.215 చెల్లించనుంది. పన్నులు కూడా కలిపితే వరుసగా రూ.215.25, రూ.225.75 చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ రెండు టీకాలను రూ.150కే కొనుగోలు చేసేది. ఈ కొత్త విధానం కింద మొత్తం టీకా ఉత్పత్తిలో 75 శాతం డోసుల్ని కేంద్రం తయారీదారుల నుంచి సేకరిస్తోంది. ఆ తర్వాత స్టాక్‌ను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తోంది. మిగతా 25 శాతం డోసుల్ని ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలుచేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడినవారికి కేంద్రమే ఉచితంగా టీకాలు వేస్తోంది. ఇదిలా ఉండగా..రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 41.69 కోట్ల టీకాలు అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 40కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని తెలిపింది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని