Covid Vaccine: జులై నాటికి 50కోట్ల డోసులు ఇచ్చి తీరుతాం!
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగుతోందంటూ వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ముందస్తుగా నిర్ధేశించుకున్న లక్ష్యాల ప్రకారం వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని స్పష్టం చేసింది.
పునరుద్ఘాటించిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగుతోందంటూ వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ముందస్తుగా నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందని స్పష్టం చేసింది. ముఖ్యంగా జులై నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వస్తున్నవి తప్పుడు కథనాలని పేర్కొంది. ఇదివరకే చెప్పినట్లుగా జులై 31 నాటికి 51 కోట్ల డోసులను కచ్చితంగా సరఫరా చేసి తీరుతామని పునరుద్ఘాటించింది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టలేకపోతోందని వస్తోన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ ప్రకటన చేసింది.
జనవరి నుంచి జులై చివరినాటికి మొత్తం 51.60కోట్ల డోసులను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గతంలోనే అన్ని రాష్ట్రాలకు తెలియజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందుకు తగినట్లుగానే వివిధ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్లను సేకరిస్తున్నామని స్పష్టం చేసింది. ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగానే ఆయా రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్లకు కేటాయిస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే 45.7కోట్ల డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేశామని.. మిగతా 6.03కోట్ల డోసులు జులై 31నాటికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో ముందుగా చెప్పిన లక్ష్యాన్ని చేరుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ ధీమా వ్యక్తం చేసింది.
ఇదిలాఉంటే, రాష్ట్రాలకు సరఫరా చేసిన డోసుల్లో ఇప్పటికే 44.19కోట్ల డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 9.9కోట్ల మంది పూర్తిస్థాయిలో (రెండు డోసులు) వ్యాక్సిన్ తీసుకున్నారని స్పష్టం చేసింది. కేవలం జూన్ నెలలోనే 11.97 కోట్ల డోసులను పంపిణీ చేయగా.. జులైలో ఇప్పటివరకు (జులై 26) 10.62 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు తెలిపింది. సాధ్యమైనంత తొందరగా ప్రజలకు వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.