Covid-19 Effect: కోలుకున్న వారిలో.. ఏడాది తర్వాత లక్షణాలు ఉంటాయా..?
కొవిడ్ తీవ్రతతో ఆస్పత్రిలో చికిత్సపొంది.. కోలుకున్న సగం మందిలో కనీసం ఒక లక్షణమైనా ఏడాది తర్వాత కూడా వేధిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
లాన్సెట్ జర్నల్లో తాజా అధ్యయనం
బీజింగ్: కరోనా వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కొవిడ్ తీవ్రతతో ఆస్పత్రిలో చికిత్స పొంది.. కోలుకున్న సగం మందిలో కనీసం ఒక లక్షణమైనా ఏడాది తర్వాత కూడా వేధిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన వుహాన్లో జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వీటిని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ ప్రచురించింది.
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు మొట్టమొదటగా కొవిడ్-19 వెలుగు చూసిన చైనాలోని వుహాన్లో అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా గతేడాది (2020) జనవరి 7 నుంచి మే 29 మధ్యకాలంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 1276 మంది రోగులను పరిగణనలోకి తీసుకున్నారు. ముఖ్యంగా కోలుకున్న 6 నుంచి 12 నెలల మధ్య కాలంలో బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వారి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు బాధితులనే నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, భౌతిక పరీక్షలు, ల్యాబ్ టెస్టులతో పాటు ఆరు నిమిషాల నడక వంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రతిముగ్గురిలో ఒకరికి ఏడాది తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. కొవిడ్తో వెంటిలేటర్పై చికిత్స తీసుకున్న బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ కాలం కొనసాగుతున్నట్లు కనుగొన్నారు.
ఆరు నెలల పాటు అలసట లేదా నరాల బలహీనత వంటి సమస్యలు చాలా మందిలో కనిపించాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలా కనీసం ఒక లక్షణంతో బాధపడిన వారి సంఖ్య ఆరు నెలల సమయంలో 68శాతం ఉండగా.. ఏడాది నాటికి 49శాతానికి తగ్గినట్లు తెలుసుకున్నారు. అంతేకాకుండా సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. కొవిడ్ను జయించిన వారు కాస్త తక్కువ ఆరోగ్యంగా ఉంటున్నట్లూ తాజా అధ్యయనంలో నిపుణులు తేల్చారు.
‘కొవిడ్-19తో ఆస్పత్రుల్లో చేరి కోలుకున్న ఏడాది తర్వాత వారిపై వైరస్ ప్రభావాలు ఎలా ఉంటాయని అంచనా వేసేందుకు అధ్యయనం చేపట్టాం. ఇప్పటివరకూ ఇలాంటి అధ్యయనాల్లో ఇదే అతిపెద్దది’ అని చైనా-జపాన్ ఫ్రెండ్షిప్ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ బిన్ కయో పేర్కొన్నారు. చాలా మంది పూర్తిగా కోలుకున్నారని.. ఆస్పత్రిలో చేరిన సమయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న వారిలోనే ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు. కొవిడ్ నుంచి కోలుకునేందుకు కొందరికి ఏడాది కంటే ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశాలున్నాయనే విషయం తాజా అధ్యయనం తెలియజేస్తోందని డాక్టర్ బిన్ కయో అభిప్రాయపడ్డారు.
అంతకుముందు కొవిడ్ తదనంతర ప్రభావాలపై ఇదే బృందం పరిశోధన జరిపింది. 1733 మందిపై జరిపిన అధ్యయనంలో.. మూడోవంతు మందిలో ఇన్ఫెక్షన్ సోకిన ఆరు నెలల తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు గుర్తించింది. అయితే, ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని.. దీన్ని కేవలం ఒక్క ఆస్పత్రిలో మాత్రమే చేపట్టినట్లు నిపుణులు గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్