Harsh Goenka: ఒమిక్రాన్ రాకతో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం.. నవ్వులు పూయిస్తోన్న గోయెంకా ట్వీట్..!
దేశంలో కరోనా వైరస్ కాలు మోపిన దగ్గరి నుంచి అన్ని రంగాల మీద ప్రభావం పడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల విషయంలో వినిపించే ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానం విపరీతంగా వాడుకలోకి వచ్చింది.
ముంబయి: దేశంలో కరోనా వైరస్ కాలు మోపిన దగ్గరి నుంచి అన్ని రంగాల మీద ప్రభావం పడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల విషయంలో వినిపించే ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవకాశం ఉన్న ప్రతి సంస్థ తమ సిబ్బందికి ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. దాంతో చాలామంది తమ సొంతప్రాంతాలకు వెళ్లి అయినవాళ్ల మధ్య ఆడుతూపాడుతూ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. గతేడాది మే తర్వాత రెండో వేవ్ ముగిసి, కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొందరు తిరిగి కార్యాలయాలకు రావాల్సి వచ్చింది. 2022లో మిగతావారిని కూడా పిలుద్దామని భావిస్తుండగా.. ఒమిక్రాన్ వచ్చిపడింది. దాంతో అంతా మొదటికే వచ్చింది. మళ్లీ సంస్థలన్నీ వర్క్ఫ్రమ్ హోంను కొనసాగించాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని వీడియో రూపంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విటర్ వేదికగా షేర్ చేశారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ నటించిన మొహబ్బతీన్ చిత్రంలోని ఆ వీడియో క్లిప్ను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఇప్పుడది నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా