Antony Blinken in India: భారత్తో అమెరికా బంధం ప్రత్యేకమైనది..!
ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కీలక భూమిక పోషించగలవని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు.
భారత పర్యటనలో అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్
దిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కీలక భూమిక పోషించగలవని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వం పట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలలో ఇవి అత్యంత కీలకమైనవని అన్నారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్న బ్లింకెన్, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్తో భేటీ అయ్యారు. కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే కార్యాచరణ, అఫ్గానిస్థాన్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడంతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై భారత నాయకత్వంతో బ్లింకెన్ చర్చించారు.
‘ప్రాథమిక స్వేచ్ఛ, మానవ హక్కులను అమెరికా గౌరవిస్తుంది. మేము భారత్ను కూడా ఇదే కోణంలో చూస్తాం. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నది’ అని ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల సంబంధాల ప్రాముఖ్యతపై మాట్లాడిన బ్లింకెన్.. భారత్, అమెరికా మధ్య సంబంధాలతో పోలిస్తే ఇటువంటివి విశ్వవ్యాప్తంగా కొన్ని దేశాలకే పరిమితమైందని అన్నారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అమెరికా విదేశాంగ విధానంలో అతి ప్రధానమైనదని ఆంటోని బ్లింకెన్ స్పష్టంచేశారు.
ఇదిలాఉంటే, రెండు రోజుల భారత్ పర్యటనలో ఉన్న బ్లింకెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. భారత పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్కు బయల్దేరి వెళ్తారు. అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్