China: ‘గుండెల్లో గూడు’ కట్టేందుకు చైనా యత్నాలు..!
చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్విటర్ (twitter) ఖాతాలో ఓ ట్వీట్ చేస్తుంది.. ఆ తర్వాత ఆ ట్వీట్ వైరల్గా మారుతుంది.. చాలా పాశ్చాత్య దేశాల్లో వార్తగా నిలుస్తుంది.. ఇక్కడ ఒక్క చోట లాజిక్ కనిపించదు..
ప్రచార యుద్ధతంత్రంపై డ్రాగన్ పట్టు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్విటర్ (twitter) ఖాతాలో ఓ ట్వీట్ చేస్తుంది.. తర్వాత ఆ ట్వీట్ వైరల్గా మారుతుంది.. చాలా పాశ్చాత్య దేశాల్లో అది వార్తగా నిలుస్తుంది.. అయితే ఇక్కడ లాజిక్కు అందని విషయం ఏంటంటే.. వాస్తవానికి ట్విటర్ను చైనాలో అధికారికంగా బ్లాక్ చేశారు. అంటే చైనా వార్తసంస్థలు చేసే ట్వీట్లు సగటు చైనా పౌరుడు చదవడు..! గ్లోబల్ టైమ్స్, జిన్హూవా లేదా మరేదైనా పత్రికలను చైనీయులకు వార్తలు అందించేందుకు అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి ఎవరి కోసం ట్విటర్లో ట్వీట్లు చేస్తున్నట్లు..? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగిలిన దేశాల మీడియాల్లో ఎటువంటి వార్త రావాలనుకుంటే .. వాటికి సంబంధించిన అంశాలను చైనా వార్తా సంస్థలు ట్వీట్ చేస్తాయి. ఈ రకంగా ఆయా దేశాల్లో ప్రజల అభిప్రాయాలను తనకు అనుగుణంగా మార్చుకొని డ్రాగన్ అనుకున్న లక్ష్యాలను సాఫీగా సాధిస్తోంది.
పశ్చిమ దేశాల పలుకుబడిని అడ్డుకోవడానికి మీడియాను చైనా (china) ఓ పదునైన ఆయుధంగా ఎంచుకొంది. ఇప్పటి వరకు ఈ రంగంలో ఆయా దేశాల హవా కొనసాగింది. తొలినాళ్లలో చైనా ఈ రంగంపై పెద్దగా వెచ్చించలేదు. చైనీయుల కోసం వార్తలను సెన్సార్ చేయడం.. విదేశీ పత్రికల జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించడంపైనే దృష్టిపెట్టింది. కానీ, చైనా ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో ప్రపంచ దేశాల్లో పాగా వేస్తోంది. ఈ సమయంలో వార్తల రూపంలో ప్రజాభిప్రాయాన్ని చైనాకు అనుకూలంగా ప్రభావితం చేయడం దానికి చాలా కీలకంగా మారింది. దాదాపు పదేళ్ల క్రితం నుంచి డ్రాగన్ కూడా మీడియా ద్వారా ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలను చైనాకు అనుకూలంగా మార్చేందుకు యత్నాలు మొదలుపెట్టింది. దీనికి కరోనావైరస్ మహమ్మారిని కూడా వాడుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయం 2020లో ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్’(ఐఎఫ్జే) 50 దేశాల్లో నిర్వహించిన సర్వేలో తేలింది.
చైనా వ్యూహం ఇది..
2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.49 వేల కోట్ల (6.6 బిలియన్ డాలర్లు)ను ప్రపంచ మీడియాలో చైనా (china) స్థానం బలోపేతం చేసేందుకు ఖర్చు చేసింది. అదే సమయంలో 2.8 బిలియన్ డాలర్లను పెట్టుబడుల రూపంలో పెట్టింది. వివిధ దేశాలకు చెందిన రిపోర్టర్లకు చైనాలో శిక్షణలు, ఎక్స్ఛేంజి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చైనా మీడియా సంఘాలు, విదేశీ జర్నలిస్టులతో చర్చాకార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు చైనా మీడియా కంటెంట్ను విదేశీ మీడియా సంస్థలకు పూర్తి ఉచితంగా అందజేస్తోంది. ఆయా దేశాల స్థానిక మీడియా సంస్థలతో సహకార ఒప్పందాలు చేసుకొంటోంది. ఈ మొత్తం వ్యవహారానికి ఇటలీ మీడియా సంస్థ ‘ఏఎన్ఎస్ఏ’ మంచి ఉదాహరణ.
బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI)లో చేరిన తొలి జీ-7 దేశంగా ఇటలీ నిలిచింది. దీనిపై సంతకాలు జరిగే సమయంలో షీజిన్పింగ్ వరుస పెట్టి మీడియా ఒప్పందాలు చేసుకొన్నారు. ఇటలీ ప్రభుత్వ మీడియా సంస్థ ‘ఏఎన్ఎస్ఏ’ - చైనా మీడియా సంస్థ జిన్హూవా మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ప్రతి రోజూ 50 చైనా సానుకూల కథనాలను ప్రసారం చేయడంతోపాటు.. ‘ఏఎన్ఎస్ఏ’ ఎడిటోరియల్ బాధ్యతలు జిన్హూవాకు దఖలు పడ్డాయి. ఫలితంగా ఇటలీ వార్తా సంస్థను ఓ ఆయుధంగా చైనా వాడుకొంది. దీంతోపాటు సీసీటీవీ, చైనా ఇంటర్నేషనల్ రేడియోతో కూడా ఒప్పందాలు కుదిరాయి. బీఆర్ఐ ప్రాజెక్టుకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి.. ఎటువంటి విమర్శలు తలెత్తకుండా చూసుకోవడానికి వాడుకొంటోంది. సెర్బియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లోని కీలక మీడియా సంస్థలపై చైనా ప్రభావం చాలా ఉంది. 2015లో చైనా కంపెనీ సీఈఎఫ్సీ చెక్ రిపబ్లిక్లోని ఎంపెరెసా మీడియా సంస్థలో వాటాలు కొనుగోలు చేసింది. టీవీ బార్రాంన్డావ్లో, టైడన్, ఇన్స్టింక్ట్ పత్రికలో స్థానం దక్కించుకొంది. ఫలితంగా వీటిల్లో చైనా వ్యతిరేక వార్తలు తగ్గాయి. పూర్తిగా చైనా సానుకూల వార్తలు వస్తున్నాయని ‘మ్యాప్ ఇన్ఫ్లూయన్స్ఈయూ’ అనే వ్యూహ సంస్థ పరిశోధనలో తేలింది.
తమ దేశ గొప్పలు చెప్పుకోవడంలో చైనా ఆగడంలేదని ‘ఫ్రీడమ్ హౌస్’లో డైరెక్టర్ సారా కుక్ పేర్కొన్నారు. స్థానిక ప్రజాస్వామ్యాలను తక్కువ చేసి చూపడం, స్థానిక చట్టాలను అతిక్రమించడం, ఆయా మీడియా సంస్థలను ఆర్థికంగా బలహీన పర్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
చైనా గుప్పిట ఆఫ్రికా..
ఆఫ్రికా వంటి పేద ఖండంలో చాలా దేశాల్లో మీడియా దయనీయంగా ఉండటం చైనాకు కలసి వస్తోంది. చైనాకు ముడిసరుకుల సరఫరా, బీఆర్ఐ ప్రాజెక్టులో ఈ ఖండం చాలా కీలకం. కెన్యాలోని స్టార్ టైమ్స్ పేరిట చైనా కంపెనీ అత్యంత చౌకగా శాటిలైట్ టీవీ ప్యాకేజీలు అందిస్తోంది. దీనికి 30 దేశాల్లో 2.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీటిలో చైనా ఛానల్స్, ఆఫ్రికా ఛానల్స్ ఉంటున్నాయి.
కరోనా పాపం ఇతర దేశాలపై నెట్టేందుకు..
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో తప్పుడు ప్రచారానికి మీడియాను విపరీతంగా వాడుకొంది. వుహాన్లో నిర్వహించిన మిలటరీ గేమ్స్లో అమెరికన్ల ద్వారా వైరస్ వ్యాపించిందని ఆరోపణలు చేసి.. దానికి బలమైన ప్రచారం కల్పించింది. అంతేకాదు.. ఇటలీలో కరోనా వైరస్ పుట్టిందని గ్లోబల్ టైమ్స్ (global times) కథనాలు వండి వార్చింది. హాంకాంగ్ విషయంలో చైనాకు అనుకూలంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న 23,750 ఖాతాలను ట్విటర్ (twitter) తొలగించింది. అయితే ఇలాంటివి 1.5 లక్షల ఖాతాల ద్వారా సమాచారాన్ని ప్రచారం చేసుకొన్నట్లు తేలింది. నిపుణులుగా చెప్పుకొంటూ కొందరు సోషల్ మీడియా ఖాతాలు తెరిచి.. చైనాకు అనుకూల వాదనలు తెరపైకి తెస్తున్నారని గత నెల బీబీసీ కథనం వెలువరించింది. గత నెల స్విస్ బయాలజిస్ట్గా చెప్పుకొంటూ విల్సన్ ఎడ్వర్డ్స్ పేరిట ఫేస్బుక్ ఖాతా చైనా అనుకూల ప్రచారం చేసినట్లు తేలింది. వాస్తవానికి ఆ పేరుతో ఏ నిపుణుడు లేడని.. అది చైనా మాయగా పలువురు పేర్కొన్నారు.
తూర్పు లద్దాఖ్ భారత్ సైన్యంపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ‘మైక్రోవేవ్’ ఆయుధంతో దాడి చేసినట్లు రెన్మిన్ విశ్వవిద్యాలయంలో జిన్ కానరాంగ్ అనే ప్రొఫెసర్ చెప్పినట్లు 2020 నవంబర్లో ‘ది టైమ్స్’ ‘ది ఆస్ట్రేలియన్’ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో భారత్లో గగ్గోలు మొదలైంది. కానీ, ఈ వార్తలు శుద్ధ అబద్ధమని భారత సైన్యం (Indian Army) ట్విటర్లో వివరణ ఇచ్చింది.
చైనాలో మాత్రం గీత దాటితే వేటే..!
చైనాలో ప్రతికూల వాదనలను ఏమాత్రం సహించదు. అక్కడ ట్విటర్, ఫేస్బుక్లపై నిషేధం ఉంది. ప్రజల అభిప్రాయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రభుత్వ రంగ మీడియా వార్తలను వాడుకొంటుంది. ఇక విదేశీ మీడియా ప్రతినిధులపై సవాలక్ష ఆంక్షలు ఉంటాయి. ఒక్క 2020లోనే 18 మంది విదేశీ మీడియా ప్రతినిధులను బహిష్కరించిందని ‘ది ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ చైనా’ పేర్కొంది. కొత్తగా ఒక్క విదేశీ జర్నలిస్టుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వారు కూడా చాలా వరకు చైనా ఇచ్చే సమాచారం పైనే ఆధారపడాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
నాగాలాండ్లో 6 జిల్లాల్లో సున్నా పోలింగ్ నమోదైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు