Blast: బెంగళూరులో పేలుడు.. ముగ్గురి దుర్మరణం

బెంగళూరు నగరంలో భారీ పేలుడు సంభవించింది. చామరాజపేటలోని ఓ భవనంలో

Updated : 23 Sep 2021 14:55 IST

బెంగళూరు: బెంగళూరు నగరంలో భారీ పేలుడు సంభవించింది. చామరాజపేటలోని ఓ భవనంలో పేలుడు జరగడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వి.వి.పురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పేలుడుకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

పంక్చర్ షాప్‌లోని కంప్రెషర్‌ వల్లే పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో పంక్చర్‌ దుకాణ యజమాని అస్లాం అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు శబ్దానికి స్థానికులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని