Rane warns Shiv Sena: శివసేన గురించి చాలా తెలుసు.. ఒక్కోటి బయటకు తీస్తా!
శివసేనపై విరుచుకుపడిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే.. పార్టీతోపాటు అందులోని నాయకుల గురించి చాలా విషయాలు తెలుసునని, ఒక్కోదాన్ని బయటకు తీస్తానని హెచ్చరించారు.
హెచ్చరించిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే
ముంబయి: కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్టు తర్వాత మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేనపై ఆయన మండిపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి శివసేనపై విరుచుకుపడిన రాణే.. పార్టీతోపాటు అందులోని నాయకుల గురించి చాలా విషయాలు తెలుసునని, ఒక్కోదాన్ని బయటకు తీస్తానని హెచ్చరించారు. ముఖ్యంగా సోదరుడి భార్యపైనే యాసిడ్ పోయాలని ఎవరు ఎవరితో చెప్పారనే విషయం తనకు తెలుసునని అన్నారు. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి రాణే.. శివసేన నాయకులపై మండిపడ్డారు.
‘వారితో (Shiv Sena) నేను 39ఏళ్ల పాటు కలిసి పనిచేశాను. నాకు చాలా విషయాలు తెలుసు. సొంత సోదరుడి భార్యపైనే యాసిడ్ విసరాలని ఎవరు ఎవరితో చెప్పారో నాకు తెలుసు. అదేం సంస్కారం..?’ అని కేంద్రమంత్రి నారాయణ్ రాణే అన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను టార్గెట్ చేసిన రాణే.. కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం వల్ల వారు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. వారికి సంబంధించిన ఒక్కో కేసును బయటకు తీసుకువస్తాన్నారు. ఇక శివసేన పార్టీకి చెందిన యువసేన విభాగం నేత సర్దేశాయ్ తన ఇంటిముందుకే వచ్చి బెదిరించాడని.. మరోసారి వస్తే మాత్రం తిరిగి వెళ్లలేడని పరోక్షంగా హెచ్చరించారు.
కేంద్ర మంత్రిగా ఉన్న నారాయణ్ రాణే, తన రాజకీయ ప్రస్థానాన్ని శివసేనతోనే ఆరంభించారు. శివసేన కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారు. 1999లో మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. కొన్ని నెలలపాటు పదవిలో కొనసాగారు. అనంతరం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 2005లో ఆయనను పార్టీ నుంచి శివసేన తొలగించింది. తర్వాత కాంగ్రెస్లో చేరిన నారాయణ్ రాణే.. 2017 వరకు అందులో కొనసాగారు. కాంగ్రెస్ను వీడిన అనంతరం 2017 అక్టోబర్లో మహారాష్ట్ర స్వాభిమాన్ పక్షా పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2018లో భాజపాకు మద్దతు ప్రకటించి ఆపార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. చివరకు 2019లో ఆ పార్టీని భాజపాలో విలీనం చేశారు. ప్రస్తుతం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM