Gowtham Adani: అదానీ కుటుంబ సంపాదన.. రోజుకు రూ.వెయ్యి కోట్లు..!
దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఉన్న గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం సంపద విలువ గత ఏడాదిలో ఏకంగా 261శాతం పెరిగింది
ఐఐఎఫ్ఎల్ వెల్త్-హురున్ సంపన్నుల జాబితాలో రెండోస్థానం
దిల్లీ: దేశంలో కొవిడ్ విజృంభణ కారణంగా కొన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కుబేరుల సంపద మాత్రం భారీగా పెరుగుతోంది. దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఉన్న గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం సంపద విలువ గత ఏడాదిలో ఏకంగా 261శాతం పెరిగింది. అదానీ, ఆయన కుటుంబం సంపాదన రోజువారీగా వెయ్యి కోట్లు (రూ.1002 కోట్లు) పెరిగిందని ఐఐఎఫ్ఎల్ వెల్త్-హురున్ (IIFL Wealth-Hurun India Report 2021) నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా తొలిసారి అదానీ సోదరులిద్దరూ ఈ జాబితాలో టాప్-10లో నిలిచారు. ఇక దేశంలో అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకేశ్ అంబానీ గతేడాదిలో రోజువారీగా రూ.169 కోట్లు మాత్రమే వృద్ధి చెందడం గమనార్హం.
* దేశంలో అపర కుబేరుడిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ గతేడాది 9శాతం పెరిగి రూ.7,18,000 కోట్లకు చేరుకుంది. రోజువారీగా ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ రూ.163 కోట్లు పెరుగుతున్నట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక వెల్లడించింది.
* గతేడాది రూ.1,40,200 కోట్లుగా ఉన్న గౌతమ్ అదానీ కుటుంబం ఆస్తుల విలువ.. ప్రస్తుతం రూ.5లక్షల కోట్లకు చేరుకుంది. రోజువారీగా ఆ కుటుంబం సంపద విలువ రూ.వెయ్యి కోట్లు పెరుగుతోంది. ఇలా ఏడాది కాలంలోనే వారి సంపద ఏకంగా 261శాతం పెరగడం విశేషం. దీంతో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ కుటుంబం రెండో స్థానానికి చేరుకుందని ఐఐఎఫ్ఎల్ నివేదిక తెలిపింది.
* హెచ్సీఎల్ గ్రూప్ అధినేత శివనాడార్, ఆయన కుటుంబం సంపద విలువ కూడా భారీగానే పెరిగింది. గతేడాదితో పోలిస్తే వారి సంపద విలువ 67శాతం పెరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక ప్రకారం వారి సంపద నిత్యం రూ.260 కోట్లు పెరుగుతోంది. దేశంలో కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న వారి ఆస్తుల విలువ రూ. 2,36,000 కోట్లుగా ఉంది.
* హిందూజా సంస్థల గ్రూప్ అధినేత ఎస్పీ హిందూజా కుటుంబం ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. రోజువారీగా వారి సంపద రూ.209 కోట్లు పెరుగుతుండగా.. గతేడాదిలో వారి ఆస్తుల విలువ 53శాతం పెరిగింది. దీంతో హిందూజా కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 2,20,000 కోట్లకు చేరుకుంది.
* దేశంలో అత్యంత ధనవంతుల్లో ఐదో స్థానంలో మిత్తల్ కుటుంబం నిలిచింది. లక్ష్మీనివాస్ మిత్తల్తో పాటు ఆయన కుటుంబం ఆస్తుల విలువ రూ.1,74,000 కోట్లు కాగా గతేడాది వారి సంపదలో 187శాతం పెరుగుదల కనిపించింది. వారి కుటుంబం రోజువారీ సంపద వృద్ధి రూ.312కోట్లుగా ఉంది.
* వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా కుటుంబం ఆస్తుల విలువ గతేడాది 74శాతం పెరిగింది. రోజువారీగా వారి ఆస్తులు రూ.190 కోట్లు పెరుగుతుండగా.. మొత్తం విలువ రూ.1,63,700 కోట్లకు చేరుకుంది. దీంతో దేశంలో అత్యంత ధనవంతుల్లో ఆరో స్థానంలో నిలిచారు.
* ఈ జాబితాలో ఏడో స్థానంలో అవెన్యూ సూపర్ మార్కెట్ సంస్థల యజమాని రాధాకిషన్ దమానీ నిలిచారు. గతేడాదిలో వీరి ఆస్తుల విలువ 77శాతం పెరిగి రూ.1,54,300 కోట్లకు చేరుకుంది. రోజువారీగా వీరి సంపద రూ.184 కోట్లు పెరుగుతోంది.
* గౌతమ్ అదానీ సోదరుడైన వినోద్ శాంతిలాల్ అదానీ కుటుంబం ఆస్తులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. గతేడాదిలో వీరి సంపద 212శాతం పెరిగింది. రోజువారీగా రూ.245 కోట్లు వృద్ధి ఉండగా.. మొత్తం ఆస్తుల విలువ రూ. 1,31,600కోట్లకు చేరుకుంది. గౌతమ్ అదానీ సోదరుడి కుటుంబం దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
* ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన కుమార్ మంగళం బిర్లా కుటుంబం ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. వీరి రోజువారీ సంపద రూ.242కోట్లు పెరుగుతోంది. వారి ఆస్తుల మొత్తం విలువ రూ. 1,22,200 కోట్లకు చేరుకుంది. గతేడాది వీరి సంపదలో ఏకంగా 230శాతం వృద్ధి కనిపించింది.
* ఐఐఎఫ్ఎల్ నివేదిక ప్రకారం, పదో స్థానంలో స్కాలర్ గ్రూపు అధినేత జయ్ ఛౌదురి నిలిచారు. గతేడాది ఆయన సంపదలో 85శాతం వృద్ధి చెందింది. రోజువారీగా వారి ఆదాయం రూ.153కోట్లు పెరిగి.. రూ.1,21,600కోట్లకు చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు