India Corona Update: కరోనా కేసులు తగ్గాయ్.. కానీ!
దేశంలో కరోనా కేసులు మరోసారి తగ్గాయి. ముందురోజు 19 వేలకు చేరువైన కేసులు.. తాజాగా 16 వేలకు పడిపోయాయి. రోజువారీ కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. అయితే మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
0.6 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు
97 కోట్ల టీకా డోసుల పంపిణీ
దిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ముందురోజు 19 వేలకు చేరువైన కొత్త కేసులు.. తాజాగా 16 వేలకు పడిపోయాయి. రోజువారీ కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. అయితే మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
తాజాగా దేశవ్యాప్తంగా 11,80,148 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,862 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 11 శాతం మేర తగ్గుదల కనిపించింది. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. అందులో 3.33 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 2.03 లక్షల(0.60 శాతం)కు చేరింది.
మృతుల సంఖ్యపై హరియాణా ఎఫెక్ట్..
నిన్న 379 మంది కొవిడ్తో మరణించారు. హరియాణా రాష్ట్రం మృతుల సంఖ్యను సవరించడంతో ఈ భారీ తేడా కనిపించింది. ఆ రాష్ట్రం నిన్న మరణాల సంఖ్య 174గా చూపింది. గత ఏడాది నుంచి 4,51,814 మంది కరోనా కాటుకు బలయ్యారు.
97 కోట్ల టీకా డోసుల పంపిణీ.. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. పండుగ వాతావరణం నెలకొనడంతో రెండు రోజులుగా ఆ వేగం తగ్గింది. నిన్న 30.26 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 97.14 కోట్ల చేరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్కు కారణమదే.. కమల్హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
India News
Siddaramaiah: కొత్త మంత్రులకు టార్గెట్స్ ఫిక్స్ చేసిన సీఎం సిద్ధరామయ్య!
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు