
India Corona: కరోనా గణాంకాలు సానుకూలమే..ఒమిక్రాన్తోనే ఆందోళన..!
కొత్తగా 9,216 కొత్త కేసులు..391 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత కొంతకాలంగా పదివేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.29 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
గురువారం 11,57,156 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,216 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు కొద్దిగా తగ్గాయి. గత 60 రోజులుగా రోజువారీ సగటు పాజిటివిటీ రేటు 2 శాతం దిగువనే నమోదవుతోంది. నిన్న 8,612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి 3.46 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.40 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
ప్రస్తుతం క్రియాశీల కేసులు లక్ష దిగువనే ఉన్నప్పటికీ.. నిన్న కాస్త పెరిగాయి. వాటి సంఖ్య 99,976గా ఉంది. 24 గంటల వ్యవధిలో 391 మరణాలు వెలుగుచూశాయి. అందులో కేరళ వాటా 320గా ఉంది. నిన్నటి వరకు 4.7లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్నటివరకు 125 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. 46.3 కోట్ల మందికి పైగా రెండు డోసులు వేయించుకోగా.. 79.3 కోట్ల మంది మొదటి డోసు తీసుకున్నారు. నిన్న 73.67 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
ఈ కరోనా గణాంకాలన్నీ కాస్త ఊరటనిస్తున్నప్పటికీ.. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూడటమే ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఇద్దరిలో ఈ కొత్త వేరియంట్ను గుర్తించారు. వారిలో తీవ్రమైన లక్షణాలు లేవని, ఎవరూ ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
E Passport: ఈ పాస్పోర్ట్లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
-
World News
Ukraine Crisis: రష్యా బంగారంపై నిషేధం ?
-
General News
Telangana News: వాణిజ్యపన్నులశాఖలో బకాయిల వసూలుకు వన్టైమ్ సెటిల్మెంట్
-
Business News
Foreign Investors: భారత మార్కెట్లపై విదేశీ మదుపర్ల విముఖతకు కారణాలివే..
-
India News
Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
-
General News
Telangana News: జూన్ 26కు చాలా ప్రత్యేకత ఉంది: రేవంత్ రెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్గా ఉండు..!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు