PrecautionDose: 22 రాష్ట్రాల్లోఒమిక్రాన్.. ప్రికాషన్ డోసు అందుకే:కేంద్రం
సుమారు నెలరోజుల తర్వాత కరోనా కొత్త కేసులు 10వేల మార్కు దాటడంపై కేంద్రం ప్రమాద ఘంటికలు మోగించింది. అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దిల్లీ: సుమారు నెలరోజుల తర్వాత కరోనా కొత్త కేసులు 10 వేల మార్కు దాటడంపై కేంద్రం అప్రమత్తమైంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, కొవిడ్పై పోరాటానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేగాకుండా ఇప్పటివరకు 90 శాతం మంది మొదటి డోసు వేయించుకున్నారని... వ్యాధి తీవ్రత, ఆసుపత్రిలో చేరిక, మరణాలను తగ్గించేందుకే ప్రికాషనరీ డోసని పేర్కొంది. దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితుల గురించి గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వివరించింది.
33 రోజుల తర్వాత 10 వేలకుపైగా కేసులు..
‘‘గత వారం సగటున రోజుకు 8వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.92 శాతంగా ఉంది. అలాగే 33 రోజుల తర్వాత తాజాగా కొత్త కేసులు 10 వేల మార్కును దాటాయి. కేసులు పెరుగుతున్న సమయంలో అత్యంత అప్రమత్తత అవసరం. ఎనిమిది జిల్లాల్లో వారపు పాజిటివిటీ రేటు 10 శాతంపైనే ఉంది. 14 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంది. మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, దిల్లీ, కర్ణాటక, గుజరాత్లో వారపు పాజిటివిటీ రేటు, కొవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 58 ఒమిక్రాన్ మరణాలు..
2 నుంచి 3 రోజుల డబ్లింగ్ టైమ్తో ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను అధిగమిస్తోందనే ఆధారాలున్నాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 961 ఒమిక్రాన్ వేరియంట్ కేసులున్నాయని, అందులో 320 మంది కోలుకున్నారని తెలిపింది. 22 రాష్ట్రాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందిందని, ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్ కారణంగా 58 మంది మరణించారని పేర్కొంది.
90 శాతం మంది వయోజనులకు మొదటి డోసు..
‘‘ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 90 శాతం మంది వయోజనులకు టీకా మొదటి డోసు అందింది. 63.3 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. పంపిణీ అయిన మొత్తం డోసులు 144 కోట్లకు సమీపించాయి. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే ముందుజాగ్రత్త (ప్రికాషన్) డోసు గురించి గుర్తుచేసేందుకు అర్హులైన వృద్ధులకు ప్రభుత్వం ఎస్సెమ్మెస్లు పంపుతుందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఏ దేశంలో తయారైన టీకాలైనా.. వ్యాధి తీవ్రతను తగ్గించేవే. వైరస్ సోకకుండా నివారించేవి కాదు. ప్రికాషన్ డోసు కూడా వైరస్ తీవ్రత, ఆసుపత్రిలో చేరిక, మరణాలను తగ్గిస్తుంది’’ అని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. టీకాకు ముందు, తర్వాత మాస్కులు వాడటం తప్పనిసరని వెల్లడించారు. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెప్పారు. హోం ఐసోలేషన్ అన్నింటికంటే ముఖ్యమైందని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?