Corona: 40వేలపైనే కొత్త కేసులు.. 70శాతం ఒక్క కేరళలోనే..

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. దీంతో క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతుండటం

Updated : 30 Aug 2021 11:46 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. దీంతో క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు బయటపడ్డాయి. కాగా.. ఇందులో దాదాపు 70శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదవడం గమనార్హం. 

* గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14,19,990 మందికి పరీక్షలు నిర్వహించగా.. 42,909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల(45,083)తో పోలిస్తే నేడు కేసులు కాస్త తగ్గినప్పటికీ 40వేల పైనే ఉండటం కలవరపెడుతోంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరింది. 

* దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా విజృంభణ ఆందోళనకరంగానే ఉంది. నిన్న అక్కడ 29,836 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 69.5శాతం ఒక్క ఈ రాష్ట్రంలోనే బయటపడ్డాయి.

* అయితే మరణాలు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. నిన్న మరో 380 మంది వైరస్‌తో ప్రాణఱాలు కోల్పోయారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,38,210 మందిని బలితీసుకుంది.

* ఒక్క రోజులో 34763 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 3.19కోట్ల మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 97.51శాతానికి చేరింది. 

* కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 3,76,324 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.15శాతంగా ఉంది.

* ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం మరో 31,14,696 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 63.43కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని