Rajnath Singh: దురాక్రమణకు యత్నిస్తే చావుదెబ్బ తప్పదు: రాజ్నాథ్ సింగ్
తూర్పు లద్దాఖ్లో సరిహద్దు వివాదంపై ప్రతిష్టంభన, జమ్ముకశ్మీర్లో ఉగ్ర చొరబాట్లకు యత్నాలు సాగుతున్న వేళ.. చైనా, పాకిస్థాన్లకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.....
దిల్లీ: తూర్పు లద్దాఖ్లో సరిహద్దు వివాదంపై ప్రతిష్టంభన, జమ్ముకశ్మీర్లో ఉగ్ర చొరబాట్లకు యత్నాలు సాగుతున్న వేళ.. చైనా, పాకిస్థాన్లకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్లో అలజడులు సృష్టించేందుకు యత్నించినా, భూ భాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినా తగిన జవాబు చెబుతామని స్పష్టంచేశారు. ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో అమరులైన 232 మంది జవాన్ల సంస్మరణార్థం చేపట్టిన ‘షహీద్ సమ్మాన్’ యాత్రలో రాజ్నాథ్ పాల్గొన్నారు. సైనికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్న రాజ్నాథ్.. తాము అధికారంలోకి రాగానే ఒకే ర్యాంకు-ఒకే పింఛను పథకాన్ని అమలు చేసినట్లు గుర్తు చేశారు. భారత్ ఏ దేశాన్ని ఆక్రమించుకోదని.. అయితే తమ జోలికొస్తే బుద్ధిచెబుతామని స్పష్టంచేశారు.
‘పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఉండాలని భారత్ కచ్చితంగా కోరుకుంటుంది. భారీ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా భారత్ను బలహీనపరిచేందుకు, అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ పాక్కు అది సాధ్యం కాదు. భారత్ ఎప్పుడూ ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు. కానీ ప్రపంచంలో ఏ దేశమైనా భారత్కు చెందిన ఒక్క అంగుళం భూమినైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే.. భారత్ గట్టి జవాబు ఇస్తుంది. వారికి చావుదెబ్బ తప్పదు’ అని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
జవాన్ల శౌర్యానికి ఇది నిదర్శనం
రేజంగ్ లా కుమావోన్ బెటాలియన్ వీర శౌర్యాన్ని రక్షణ శాఖ మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. ఈ బెటాలియన్లో 124 మంది జవాన్లు అమరులు కాగా.. వారు 1200 మంది చైనా సైనికులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. భారత జవాన్ల శౌర్యానికిది నిదర్శనమని కొనియాడారు. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం నాలుగు ధామ్లు (చార్ ధామ్) ఉన్నాయని, సైన్య ధామ్ పేరుతో అయిదో ధామ్ను నిర్మించనున్నట్లు రాజ్నాథ్ తెలిపారు. దీని కోసం అమరులైన ఉత్తరాఖండ్ సైనికుల ఇళ్ల నుంచి మట్టిని తెప్పించనున్నట్లు వివరించారు. వారి పేర్లను ధామ్పై లిఖించినున్నట్లు పేర్కొన్నారు. జవాన్ల త్యాగానికి గుర్తుగా ఈ స్మారకం ఎప్పటికీ ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్