Syria and Iraq: కరవు కోరల్లో ఇరాక్, సిరియా..పెను సమస్యగా మారనున్న తీవ్ర నీటిఎద్దడి
ఏళ్ల తరబడి అంతర్యుద్ధం, ఉగ్రవాద దాడులు, అస్తవ్యస్త పాలనతో చితికిపోయిన సరిహద్దు దేశాలు
1.2 కోట్ల మందిపై ప్రభావం
హెచ్చరించిన అంతర్జాతీయ సహాయ సంస్థలు
బీరట్: ఏళ్ల తరబడి అంతర్యుద్ధం, ఉగ్రవాద దాడులు, అస్తవ్యస్త పాలనతో చితికిపోయిన సరిహద్దు దేశాలు ఇరాక్, సిరియా ఇప్పుడు తీవ్ర కరవుకాటకాలతో అల్లాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నానాటికీ పెరిగిపోతున్న భూతాపంతో అక్కడ నీటి ఎద్దడి పెనుసమస్యగా మారబోతోందని, లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడనున్నారని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నీటి కొరత కారణంగా జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోతున్నాయని, దీనివల్ల విద్యుదుత్పత్తికీ అడ్డంకులు ఏర్పడుతున్నాయని, తద్వారా ఆరోగ్య వ్యవస్థ, అత్యవసర మౌలిక సదుపాయాలపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉందని వెల్లడించాయి. రెండు దేశాలకూ కీలక జల వనరైన యూఫరేట్స్ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో తగ్గడంతో రెండు దేశాల్లో కలిపి 1.2 కోట్ల మందిపై ప్రభావం పడిందని పేర్కొన్నాయి. ఇరాక్లోని టిగ్రి నది కూడా దాహార్తి తీర్చలేకపోతోందని చెప్పాయి.
సుమారు 400 కిలోమీటర్ల వ్యవసాయ భూమిపై కరవు ప్రభావం పడిందని తెలిపాయి. ఉత్తర సిరియాలో 30 లక్షల మందికి విద్యుదుత్పత్తి వనరుగా ఉన్న రెండు జలాశయాలను మూసివేసే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని హెచ్చరించాయి. ఇరాక్లోని కల్లోల పరిస్థితుల వల్ల లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని, సిరియాలోనూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో మంది పారిపోతున్నారని, ఇప్పుడు రాబోతున్న నీటి ఎద్దడి విపత్తు మరింత మందిని నిరాశ్రయులను చేస్తుందని నార్వే శరణార్థి మండలి ప్రాంతీయ డైరెక్టర్ కార్స్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారితో సతమతమవుతున్న ప్రజలపై నీటి ఎద్దడి ముప్పు మరింత ప్రభావం చూపనుందని కేర్ సంస్థ ప్రతినిధి నిర్వానా షాకీ పేర్కొన్నారు. వారిని రక్షించడానికి ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగాలని డానిష్ శరణార్థుల మండలి, యాక్టెడ్, యాక్షన్ అగెనెస్ట్ హంగర్ సంస్థల ప్రతినిధులు సూచించారు. మరోవైపు లెబనాన్లోనూ వచ్చే రోజుల్లో 40 లక్షల మంది తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోబోతున్నారని యూనిసెఫ్ హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో