Covid-19 : చిన్నారులకు టీకాలు సురక్షితమేనా..?
చిన్నారులకు వ్యాక్సిన్ సురక్షితమేనని అమెరికా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
వాస్తవ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
వాషింగ్టన్: కొవిడ్-19ను ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. వైరస్ను నిరోధించడంలో ఈ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నారులకూ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని పలు దేశాలు మొదలుపెట్టాయి. దీంతో అసలు చిన్నారులకు కొవిడ్ టీకాలు సురక్షితమేనా అనే అనుమానాలు, భయాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమేనని అమెరికాలో వాస్తవ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలో 12 నుంచి 17ఏళ్ల మధ్య వయసున్న లక్షల మంది పిల్లలకు ఇప్పటికే ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్ను అందిస్తున్నారు. వీరితోపాటు 5 నుంచి 11ఏళ్ల చిన్నారులకు ఈ నవంబర్ నుంచే ఫైజర్ పంపిణీని మొదలుపెట్టారు. ఇప్పటికే 50లక్షల మందికి తొలిడోసును అందించారు. ఇప్పటివరకు వారిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని వ్యాక్సిన్లపై అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణ విభాగం స్పష్టం చేసింది. 12ఏళ్ల వయసువారికి సాధారణ డోసు ఇస్తుండగా.. ఐదేళ్ల వయసు పైబడిన వారికి మాత్రం పెద్దవారితో పోలిస్తే స్వల్ప మోతాదులోనే అందిస్తున్నారు. ఇలా 3100 వ్యాక్సిన్ తీసుకున్న వారి సమాచారాన్ని అమెరికా ఆహార, ఔషధ సంస్థ (FDA) విశ్లేషించింది. చిన్నారుల్లో కొవిడ్-19ను నిరోధించడంలో వ్యాక్సిన్ 91శాతం సమర్థత చూపిస్తోందని వెల్లడించింది. ముఖ్యంగా యువకుల మాదిరిగానే చిన్నారుల్లోనూ కొవిడ్ను ఎదుర్కొనే యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించింది. తద్వారా చిన్నారులకు కొవిడ్ టీకాలు సురక్షితమనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
దుష్ర్పభావాలు స్వల్పమే..
వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారుల్లో దుష్ప్రభావాలపై దృష్టి పెట్టిన నిపుణులు.. కొందరిలో మాత్రమే జ్వరం, టీకా తీసుకున్న చోట నొప్పి వంటి సమస్యలు కనిపిస్తున్నాయని గుర్తించారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారుల గుండెలో వాపు రావడం (Myocarditis) అత్యంత అరుదేనని నిపుణులు స్పష్టం చేశారు. ఐదు నుంచి 12ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఇటువంటి ముప్పు అసలే లేదని వెల్లడించారు. కేవలం రెండో డోసు తీసుకున్న తర్వాత కొంతమంది యువకుల్లో మాత్రమే ఇటువంటివి కనిపించాయని అయినప్పటికీ వారు త్వరగానే కోటుకుంటున్నట్లు తెలిపారు. ఇటువంటి స్వల్ప ముప్పుతో పోలిస్తే వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలే అధికమని అమెరికా నిపుణులు ఉద్ఘాటించారు. ఇప్పటికే వీటిపై ఉన్న సమాచారాన్ని అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కూడా విశ్లేషిస్తోంది. ఏదేమైనా వ్యాక్సిన్ల వల్ల యువకులకు, చిన్నారులకు ఎటువంటి ముప్పు లేదని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన చిన్నారుల హృద్రోగ నిపుణులు డాక్టర్ మ్యాథ్యూ ఒస్టర్ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, భారత్లో ఇప్పటికే అర్హులైన వారిలో 89శాతం మందికి తొలిడోసు అందించగా.. 60శాతం మందికి పూర్తి మోతాదులో కొవిడ్ వ్యాక్సిన్ అందించారు. త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. భారత్లో చిన్నారులపై జరిపిన ప్రయోగాల్లోనూ ఇవి సురక్షితమని తేలడంతో వీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు