Afghanistan: అఫ్గాన్ను ఒంటరిగా వదిలేస్తే.. ప్రపంచానికే ప్రమాదం..!
తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్ను అలాగే ఒంటరిగా వదిలేస్తే.. అక్కడి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్ ఖురేషీ హెచ్చరించారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ
ఇస్లామాబాద్: తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్ను అలాగే ఒంటరిగా వదిలేస్తే.. అక్కడి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ హెచ్చరించారు. అలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్థాన్ వైపు సానుకూల విధానాన్ని అవలంబించాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ పర్యటనలో ఉన్న స్పెయిన్ విదేశాంగ మంత్రితో సమావేశమైన అనంతరం సంయుక్తంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో షా మహ్మద్ ఈ పిలుపునిచ్చారు.
అఫ్గానిస్థాన్ను ఒంటరి చేయడం వల్ల అఫ్గాన్ ప్రజలే కాకుండా ఆ ప్రాంతం, యావత్ ప్రపంచం కూడా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అందుకే వారిపై ఒత్తిడి, బెదిరింపు చర్యలు, ఘర్షణ వాతావరణం పని చేయవని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. అఫ్గానిస్థాన్ విషయంలో నూతన సానుకూల విధానాన్ని అనుసరించాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని సూచించారు. శాంతిస్థాపనలో భాగంగా తాలిబన్లతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అఫ్గాన్లో నెలకొన్న మానవ సంక్షోభాన్ని నివారించడంపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాలని సూచించారు. ఇందులో భాగంగా నిధుల సమీకరణ కోసం జెనీవాలో జరుగనున్న సమావేశం పట్ల పాక్ విదేశాంగ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, అఫ్గానిస్థాన్లో ఉన్న తాజా పరిస్థితులతో దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని ఐరాస ఈమధ్యే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది ‘రాజకీయ ప్రతీకారమే’ అని స్పష్టంగా అర్థమవుతుందని ఆమ్ఆద్మీ పార్టీ పేర్కొంది. -
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
ఎయిర్పోర్టు(Airport)లో ఆగిఉన్న ఒక విమానాన్ని మరో విమానం ఢీకొంది. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమైంది. -
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
ఓ కండక్టర్ బస్సులోని మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన వీడియో వైరలవడంతో అధికారులు ఆ కండక్టర్ను సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. -
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం లభించలేదు. -
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్ సిబ్బంది దాదాపు 39 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. -
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
India - Myanmar: భారత్-మయన్మార్ సరిహద్దుల్లో 1600 కిలోమీటర్ల కంచె నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30వేల కోట్లు వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!
ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని సునీత వినిపించడంపై విమర్శలు గుప్పించిన భాజపా.. బిహార్లో రబ్రీ దేవి మాదిరిగా ఆమె కూడా మారనున్నారనే అనుమానం వ్యక్తం చేసింది. -
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్గా మారిన ఫొటో
ఓ రాజకీయ నేతకు చెందిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. అందులో ఆయన కరెన్సీ నోట్ల (Currency notes) పై హాయిగా నిద్రిస్తుండటమే కారణం. -
కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వర్గాల వెల్లడి
Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆప్ వర్గాలు ఆరోపించాయి. -
కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్ కేసు
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. దీని విచారణకు సంబంధించి త్వరలో సమన్లు జారీ చేయనుంది. -
దిలీప్ ఘోష్కు భాజపా షోకాజ్ నోటీసులు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై వివరణ కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఘోష్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. -
నిరుద్యోగ సమస్యపై ‘సీఈఏ’ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
‘అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు’ అని ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం
Kejriwal arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. దిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన
Sunita Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన గురువారం కోర్టులో బయటపెడతారని చెప్పారు. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం
Encounter: బీజాపుర్ జిల్లాలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్ ఫరూఖీ
బిగ్బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ(Munawar Faruqui)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బిహార్లో ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్’ సిస్టర్స్..
బిహార్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు - అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. -
ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు
ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
2030 నాటికి విమాన సర్వీసులు డబుల్..
-
ఉప్పల్లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన