Israel Drill: మరో రూపంలో మహమ్మారి ముంచుకొస్తే..?
ఒకవేళ కొత్త రూపంలో లేదా మరో ప్రాణాంతక వైరస్ విజృంభిస్తే ఎదుర్కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో తెలుసుకునేందుకు ‘ఒమేగా డ్రిల్ (Omega Drill)’ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కొవిడ్ డ్రిల్ను నిర్వహించింది.
కొవిడ్ సంసిద్ధతపై ఇజ్రాయెల్ జాతీయస్థాయి డ్రిల్
జెరూసలేం: దాదాపు రెండేళ్ల క్రితం ఊహించని రీతిలో వచ్చిపడిన కరోనా వైరస్ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక అప్పట్లో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. చివరికి వ్యాక్సిన్ రాకతో ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ పలు దేశాలు మాత్రం కొవిడ్ విలయం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. ఇదే సమయంలో భవిష్యత్తులో ఈ ప్రాణాంతక వేరియంట్లు మరోసారి విరుచుకుపడితే పరిస్థితి ఏంటనే విషయంపై పలు దేశాలు ఆలోచనలో పడ్డాయి. ఇందులో భాగంగా ఒకవేళ కొత్త రూపంలో లేదా మరో ప్రాణాంతక వైరస్ విజృంభిస్తే ఎదుర్కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ నడుం బిగించింది. కొవిడ్ సంసిద్ధతపై ‘ఒమేగా డ్రిల్ (Omega Drill)’ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కొవిడ్ డ్రిల్ను నిర్వహించింది.
దేశంలో మరోసారి కొవిడ్ తరహా వైరస్ లేదా కొత్త వేరియంట్ రూపంలో కరోనా విరుచుకుపడితే తీసుకునే చర్యలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు చేసే సామర్థ్యం, ఆస్పత్రుల్లో చికిత్సలు, లాక్డౌన్ విధానాలు, కొత్త వేరియంట్లపై పర్యవేక్షణ, ప్రజలకు ఆర్థిక సహకారం, సరిహద్దుల్లో అనుసరించాల్సిన విధానాలతో పాటు క్వారంటైన్ అమలు చేసేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం అత్యంత సురక్షితంగా ఉందని ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నెట్ పేర్కొన్నారు. ఇదే తరహాలో ప్రజలకు రక్షణ కల్పిస్తూ సాధారణ పరిస్థితులను కొనసాగించడంతోపాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకే ఈ తరహా డ్రిల్ను చేపట్టామన్నారు.
ఇదిలాఉంటే, కొవిడ్ వ్యాక్సినేషన్లో ముందున్న ఇజ్రాయెల్.. బూస్టర్ డోసు పంపిణీని ఇప్పటికే మొదలుపెట్టింది. మరోవైపు అక్కడ కొవిడ్ తీవ్రత కూడా అదుపులోనే ఉంది. ఆగస్టు నెలలో తీవ్ర కొవిడ్ కేసుల సంఖ్య 700 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 500లకు తగ్గింది. అప్పట్లో రోజువారీ కేసుల సంఖ్య 10వేలు ఉండగా.. ప్రస్తుతం 500లకు తగ్గినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే 12ఏళ్లకుపైబడిన అర్హులందరకీ రెండు మోతాదుల్లో వ్యాక్సిన్ అందించింది. మూడో డోసును మొదలు పెట్టిన ఇజ్రాయెల్.. త్వరలోనే 5 నుంచి 11ఏళ్ల వయసు చిన్నారులకు వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్